#🗞పాలిటిక్స్ టుడే
ఇవాళ ఒక సాధారణ కుటుంబం — నలుగురో ఐదుగురో సభ్యులతో — తన జీవితకాలం మొత్తం కోటి యాభై లక్షల ఖర్చుతోనే గడుపుతోంది. అంటే, నలుగురు లేదా ఐదుగురు ఉన్న కుటుంబాల్లో 85% కుటుంబాలు నెలకు 25 వేల రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నాయి.
ఇది ఎంత సిగ్గు! “మేము అభివృద్ధి చేస్తున్నాం” అని గర్వంగా చెప్పుకునే మీ పాలకులారా… మీరు ఒక సంవత్సరం మీ వాహనాల్లో వాడిన పెట్రోలు ఖర్చు మా ఒక కుటుంబం జీవితకాలం సంపాదించిన మొత్తం సంపదకు సమానం అవుతుంది!
ఒక వ్యక్తి జీవితకాలం 60 సంవత్సరాలు అనుకుంటే — నెలకు 25 వేలు, సంవత్సరానికి 3 లక్షలు, 60 ఏళ్లకు కోటి 80 లక్షలు. ఇది మా జీవితాలు. మీరు చేసేది అభివృద్ధా… లేక మా చిన్న చిన్న జీవితాలను చిదిమి చంపడమా?
పాలకులారా! మీరు ఏ ఉద్యోగం చేసి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు? ఏ న్యాయబద్ధమైన వ్యాపారం చేసి కోటానుకోట్లు సంపాదిస్తున్నారు? అంతా ప్రజల సొమ్మే కదా! మీరు డజన్ల కొద్దీ వాహనాల్లో, విమానాల్లో తిరగవచ్చు. బహుళ అంతస్తుల మేడల్లో కులకవచ్చు. కానీ మేము రేకుల కొంపల్లో కూడా ఉండడానికి వీలు లేదు.
అభివృద్ధి పేరుతో మమ్మల్ని సర్వనాశనం చేయడమే మీ పాలన గొప్పతనమా? దీన్నే అభివృద్ధి అంటారా?
ప్రజలారా… ఒక్కసారి ఆలోచించండి!
ఒకడు “దేశం వెలుగుతోంది” అంటాడు.
ఒకడు “మేరా దేశ్ మహాన్” అంటాడు.
ఒకడు “స్వర్ణాంధ్ర” అంటాడు.
ఒకడు “బంగారు తెలంగాణ” అంటాడు.
ఒకడు “రేస్ నంబర్ వన్” అంటాడు.
కానీ వాస్తవం ఏమిటి?
నలుగురు సభ్యుల కుటుంబం నెలకు 25 వేలు కూడా సంపాదించడం లేదు. దానిలోనూ 30% పైగా ప్రభుత్వం విధించే వివిధ రకాల పన్నుల రూపంలో తిరిగి ప్రభుత్వానికే చెల్లించాల్సి వస్తోంది.
హైద్రా పేరుతోనూ, రోడ్డు వైడెనింగ్ పేరుతోనూ, అభివృద్ధి పేరుతోనూ ప్రజల జీవితాలను చిదిమేస్తున్నారు. భూములు రిజిస్ట్రేషన్ చేసేది వాళ్లే, ఇళ్లకు పర్మిషన్ ఇచ్చేది వాళ్లే, కరెంటు ఇచ్చేది వాళ్లే, రోడ్లు వేసేది వాళ్లే, మోరీలు కట్టేది వాళ్లే… అన్నీ వాళ్లే చేసి, తర్వాత “అక్రమం” అంటూ కూల్చివేస్తున్నారు.
ఇది ప్రజాపాలనా… లేక ప్రజా కంటక పాలనా? చెప్పండి!
ఇంత దుర్మార్గం జరుగుతున్నా కొంతమంది ఇంకా ఆ దుర్మార్గపు ప్రభుత్వాలను, నాయకులను వెరికేసుకుని సోషల్ మీడియాలో లేని పోని గొప్పలు చెప్పుకుంటూ భజనలు చేస్తున్నారు. ఆ భజన గొంతులకు సిగ్గుండాలి!
ఈ దేశం సంపాదించే ప్రతి పైసాలో మన వాటా ఉంది.
యంత్రాలు సంపాదించే ప్రతి సంపదలో మన వాటా ఉంది.
జియో లాంటి కంపెనీల లాభాల్లో కూడా మన వాటా ఉంది.
కానీ మనకు కుప్పలు కాదు… అప్పులు పంచుతున్నారు.
ఇకపై మౌనం వీడండి.
ప్రతి అన్యాయానికి ప్రశ్నించండి.
ఉద్యమాలు చేయండి.
మన బ్రతుకులను గౌరవించి మనకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేదాకా!


