ShareChat
click to see wallet page
search
ఉపముఖ్యమంత్రి పర్యటనకు సిద్ధమవుతున్న దమ్మపేట… ఏర్పాట్లపై ఎమ్మెల్యే జారె సమీక్ష 13.04.2026 - సోమవారం దమ్మపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు వేగం చేకూర్చే దిశగా కీలక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన జరగనున్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు మండల అధికారులతో కలిసి విస్తృతంగా ఏర్పాట్లను సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖల మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు జగ్గారం, మల్లారం గ్రామాల్లో సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కార్యక్రమ స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. పర్యటన విజయవంతం కావాలనే లక్ష్యంతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా మండలంలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడి ప్రజలకు ఉపయోగకరంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
🏛️రాజకీయాలు - ShareChat