#భక్తి #🙏🔱కాశీ విశ్వనాథ్ ధామ్🛕 #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #😇శివ లీలలు✨ #🛕శివాలయ దర్శనం
*చిన్న కాశీ కుండలేశ్వరంకు చేరని ఆర్టీసీ.. భక్తుల పాట్లు పట్టవా..???*
*ఇప్పుడు రోడ్డు బాగుంది,మరి బస్సు ఎప్పుడు వస్తుంది..???*
*✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️*
కాశీ యాత్రకు వెళ్లేవారు ముందుగా దర్శించుకోవాల్సిన పరమ పవిత్ర క్షేత్రం, 'దక్షిణ కాశీ'గా ప్రసిద్ధి చెందిన కుండలేశ్వరం నేడు రవాణా సౌకర్యాలు లేక వెలవెలబోతోంది..
ఒకప్పుడు అమలాపురం డిపో నుండి క్రమం తప్పకుండా నడిచిన బస్సు సర్వీసు నేడు రోడ్డు మరమ్మతుల సాకుతో నిలిపివేయడంతో యాత్రికులు, స్థానిక పరిసర గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కోనసీమలోని *కాట్రేనికోన మండలంలో వృద్ధ గౌతమి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయానికి పురాణ ప్రాశస్త్యం మెండు.* నిత్య పుష్కరాలు నిలయంగా ఉంది. హనుమంతుడు తన చెవి కుండలాలను ఇక్కడ శివుడికి సమర్పించాడని, అందుకే ఈ స్వామికి 'కుండలేశ్వరుడు' అని పేరు వచ్చిందని ప్రతీతి.కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునే ముందు ఇక్కడ వృద్ధ గౌతమిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని ఆధ్యాత్మిక వేత్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు వంటి వారు ప్రబోధించడంతో ఇటీవల కాలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే ఏడాది పొడవునా పుష్కర స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని వ్యాస మహర్షి వరం ఇచ్చారని భక్తుల నమ్మకం. బస్సు రాదేగతంలో రోడ్డు అధ్వాన్నంగా ఉందన్న కారణంతో అమలాపురం డిపో అధికారులు బస్సు సర్వీసును నిలిపివేశారు. అయితే, ఇటీవల ఆ రోడ్డుకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇప్పుడు బస్సు నడపడానికి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేవని స్థానికులు వాపోతున్నారు..బస్సు లేకపోవడంతో భక్తులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. *అధిక ధరలు వెచ్చించి ప్రయాణించడం సామాన్య భక్తులకు భారంగా మారింది.* గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు పనుల నిమిత్తం అమలాపురం వెళ్లాలంటే సరైన రవాణా లేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.పుష్కరాల సమయంలోనే కాకుండా, కార్తీక మాసం మరియు ప్రతి సోమవారం ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న క్షేత్రానికి బస్సు సర్వీసును పునరుద్ధరించడం కేవలం భక్తుల సౌకర్యార్థమే కాకుండా, ఆర్టీసీకి కూడా లాభదాయకమని అందరూ భావిస్తున్నారు."రోడ్డు సరిగా లేదని బస్సు ఆపారు.. ఇప్పుడు రోడ్డు బాగుంది, మరి బస్సు ఎప్పుడు వస్తుంది..?" అని కుండలేశ్వరం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. స్వర్గీయ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి జీవించి ఉన్న రోజులలో కుండలేశ్వరం బస్సు పునరుద్ధరించకపోతే జన్మభూమి కార్యక్రమం బహిష్కరిస్తామన్న గ్రామస్తులు ప్రకటనలను ఢిల్లీలో ఉన్న బాలయోగి వార్తాపత్రికల్లో చదివి వెంటనే స్పందించి తెల్లారేసరికి రాజమండ్రి నుండి ఆర్టీసీ ఉన్నతాధికారులను పంపించి బస్సు నడిపించారని స్థానికులు ఆనాటి సంఘటనలను పేర్కొంటున్నారు. సమస్యలపై స్పందించే బాలయోగి లాంటి నాయకులు నేడు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *ఇకనైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అమలాపురం - కుండలేశ్వరం మార్గంలో బస్సు సర్వీసులను ప్రారంభించి, భక్తుల 'చిన్న కాశీ' దర్శనాన్ని సులభతరం చేయాలని కోరుతున్నారు.*
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


