ఏకాదశి అంటే తెలుగు పంచాంగంలో వచ్చే పదకొండవ తిథి. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి — ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. అందుకే ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి.
ఈ రోజున ఉపవాసం ఉండటం హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. చంద్రుడు, సూర్యుడు ప్రత్యేక స్థితిలో ఉండే కారణంగా శరీరంలోని జీర్ణక్రియ కొంచెం మందగిస్తుందని పూర్వులు భావించారు. అందుకే ఆ రోజున తక్కువ ఆహారం తీసుకోవడం లేదా ఉపవాసం ఉండడం మంచిదని చెప్పారు.
ఏకాదశి ఉపవాసం వల్ల:
కడుపుకు విశ్రాంతి లభిస్తుంది
శరీరం శుభ్రపడుతుంది
మనసుకు ప్రశాంతత వస్తుంది
భక్తి, ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది
వైకుంఠ ఏకాదశి, తొలిఏకాదశి వంటి కొన్ని ఏకాదశులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.
సనాతన సమాచారం కొరకు మా టెలిగ్రామ్ ఛానల్ను ఫాలో అవ్వండి 👇
https://t.me/Bharathavedam1
#🙏సనాతనధర్మం🙏🌺



