వందేమాతరం
*లోక్ సభ సీట్లు పెంపు - కాంగ్రెస్ ప్రతిపాదన వెనక కుట్ర*
భారతదేశంలో జనాభా పెరుగుదల నేపథ్యంలో లోక్సభ స్థానాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పెంచాలని ఆలోచిస్తోంది. ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం జనాభా ఆధారంగానే కాకుండా ఆర్థిక ప్రాతిపదిక (GDP) కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇది ఒక కొత్త దృష్టికోణం.
మొదట ఈ ఆలోచన వినడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు మరింత ప్రాతినిధ్యం ఉండాలని భావించడం సహజమే. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఆలోచనను లోతుగా పరిశీలించడం అత్యంత అవసరం.
జనాభాకు జిడిపిని అనుసంధానించి దాని ఆధారంగా సీట్లు కేటాయించాలని అనుకుంటే, ఆ formula ఎక్కడ వరకూ వర్తించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. దేశ స్థాయిలో మాత్రమేనా, లేక రాష్ట్ర స్థాయిలో కూడా వర్తించాలా?. దేశ స్థాయిలో జరిగినప్పుడు అది రాష్ట్ర స్థాయిలో కూడా జరగవలసిందే. ఒకవేళ అదే సూత్రాన్ని రాష్ట్రం లోపల కూడా వర్తింపజేస్తే, తెలంగాణలో హైదరాబాద్ నగరం రాష్ట్ర జిడిపిలో సింహభాగం (65%) కలిగి ఉన్నందున, అక్కడికి మరిన్ని సీట్లు ఇవ్వాలి, మిగతా జిల్లాల సీట్లు తగ్గించాలి అని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఇది వినడానికి కఠినంగా అనిపించినా, ప్రతిపాదన యొక్క విస్తరణ ఆలోచన అదే.
ఇక్కడే మనం ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జిడిపిని అనుసంధానించి దాని ఆధారంగా ప్రాతినిధ్యం నిర్ణయిస్తే, అభివృద్ధి చెందిన ప్రాంతాలు మరింత శక్తివంతమవుతాయి, ఇప్పటికే వెనుకబడిన ప్రాంతాలు మరింత బలహీనపడతాయి. ఇది ప్రజాస్వామ్య సమానత్వ సూత్రానికి విరుద్ధంగా మారుతుంది. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానమైన ఓటు విలువను ఇచ్చింది. ఒక గ్రామంలో నివసించే రైతు ఓటు విలువ, ఒక పెద్ద నగరంలో నివసించే ధనికుని ఓటు విలువతో సమానమే. కానీ జిడిపిని ప్రమాణంగా తీసుకుంటే, ఆర్థికంగా బలమైన ప్రాంతాలకు ఎక్కువ రాజకీయ శక్తి లభిస్తుంది, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం యొక్క అసలు ఉద్దేశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ధనికులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థ కాదు. అది ప్రతి మనిషికి సమాన హక్కులు, విలువ ఇచ్చే వ్యవస్థ.
ఈ చర్చలో మరొక సున్నితమైన అంశం కూడా మనం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. సమాజంలో భిన్న వర్గాలు, భిన్న ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు, ఏ విధానాన్నైనా మతం లేదా వర్గం కోణంలో అర్థం చేసుకోవడం కంటే, రాజ్యాంగ విలువల కోణంలో చూడడం సముచితం. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రతిపాదన మరింత దీర్ఘంగా ఆలోచిస్తే, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ఎక్కువ ప్రాతినిధ్యం, మిగిలిన జిల్లాలకు తక్కువ ప్రాతినిధ్యం ఏర్పడాలి అనే వారి అంతరంగ ఆలోచనలను వెనక భయంకరమైన కుట్ర కనిపిస్తుంది.
తెలంగాణలో హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాసే ఒక మతము అధిక జనాభా కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ప్రకారం ఆ మతానికి ఎక్కువ ప్రాతినిధ్యం కట్టబెట్టి మిగతా జిల్లాలకు తక్కువ ప్రాతినిధ్యం కలిగించడం వలన రాష్ట్ర అధికారంలో ఆ మతం యొక్క ఆధిపత్యం మరింత పెంచి రాష్ట్రం మొత్తం వారి ఆధీనంలోకి అందించే కుట్ర కోణం కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దేశంలో అవలంబిస్తున్న జాతి వ్యతిరేక కుట్రలో భాగంగానే మనం భావించాలి. దీనివలన సమాజం మరింత విభజనకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఐక్యత అవసరం, విభజన కాదు.
కాబట్టి లోక్సభ సీట్ల కేటాయింపులో ప్రాథమిక ప్రమాణంగా జనాభానే ఉండాలి. అదే ప్రజాస్వామ్యానికి పునాది. మన దేశం ఒక కుటుంబంలాంటిది. ఒక ఇంట్లో ఒకరు ఎక్కువ సంపాదిస్తున్నారని మిగతావారిని నిర్లక్ష్యం చేయము. అందరిని సమానంగా చూసుకుంటాం, అవసరమైన వారికి ఎక్కువ సహాయం చేస్తాం. అదే భావన దేశ పాలనలో కూడా ఉండాలి. ప్రతి ప్రాంతం, ప్రతి మనిషి సమాన గౌరవం పొందాలి, సమాన హక్కులు కలిగి ఉండాలి.
ఈ సమస్య కేవలం సీట్ల గురించి కాదు, ఇది మన భవిష్యత్తు గురించి. మనం తీసుకునే నిర్ణయాలు సమానత్వాన్ని బలపరుస్తాయా, లేక అసమానతను పెంచుతాయా అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సమతుల్య దృష్టితో, విస్తృత ఆలోచనతో ముందుకు సాగాలి.
జైహింద్ జై భారత్
మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
16.04.2026 #🆕Current అప్డేట్స్📢 #🇮🇳దేశం #😁Hello🙋♂️ #🏛️రాజకీయాలు

