#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party 🌾 ఎక్కడి ధాన్యం అక్కడే❗
⚠️ కాంగ్రెస్ సర్కార్ కాంటా పెడ్తలేదని రోడ్డెక్కిన రైతులు 👨🏻🌾
🌾🌽 వడ్లు, మక్కలతో నిండిపోయిన మార్కెట్లు
🌧️ రైతులను భయపెడుతున్న అకాల వర్షాలు
📣 కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ మండిపాటు. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలు
అన్నం పెట్టే రైతన్నపై కాంగ్రెస్ సర్కార్ పగబట్టినట్టు చేస్తున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా మొండికేయడంతో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయి అన్నదాతల్లో రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతున్నది. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో వడ్లు, మక్కల కుప్పలు నిండిపోయి వాటిని కొనేవారు లేక రైతాంగం దిక్కులు చూస్తున్నది.
కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం, కాంటా పెడ్తలేరని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని, గన్నీ బ్యాగులు ఇస్తలేరని, తాలు, తేమ పేరిట కొర్రీలను నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వెంటనే ధాన్యం కొనకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


