నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం
ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం అక్షయ తృతీయ శుభ సందర్భంలో ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకోవడం విశేషం.
కేదార్నాథ్ ఆలయం తెరుచుకోవడంతో భక్తుల “హర హర మహాదేవ్” నినాదాలతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగనున్నాయి.
ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా డోలీ (ఉత్సవమూర్తి) ఇప్పటికే కేదార్నాథ్ ధామ్కు చేరుకుంది.
అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు 14.5 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు.
ఇందులో ఒక్క కేదార్నాథ్ దర్శనం కోసమే 4,95,173 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషంగా మారింది.
భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 15,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.
ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.
ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఫోటోలు తీయడం, వీడియోలు చేయడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపొందించడం వంటి కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించారు
#🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🙏🔱కాశీ విశ్వనాథ్ ధామ్🛕 #🛕శివాలయ దర్శనం #🌅శుభోదయం


