మనచుట్టూ పచ్చని పర్యావరణం కోసం నిశ్శబ్దంగా కష్టపడే వారు ఎంతో మంది వున్నారు. TALRadio అలాంటి వారు చేస్తున్న ప్రయత్నాల్ని సేకరించి మీకు అందిస్తూ ఉంటుంది.
ఇదిగో, సమాజం కోసం ఆలోచించే మరో మంచి వ్యక్తి గురించి మీ కోసం…
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతానికి చెందిన సుధాంశు డే అనే రైతు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా ఉప్పుతో నిండిపోయిన అక్కడి నేలలను దేశీ విత్తనాలతో మళ్లీ సాగులోకి తెచ్చారు. ప్రతి సంవత్సరం వచ్చే తుపానులు, వరద నీటి వల్ల పంటలు పండక రైతులు ఆశలు వదులుకుంటున్న సమయంలో, ఆయన 192 రకాల దేశవాళీ వరి వంగడాలను సేకరించి 'Durbachati Folk Seed Bank'ను ఏర్పాటు చేశారు.
దీంతో ఇప్పుడు సుమారు 1,500 మంది రైతులు కలిసి 6,000 బిఘాల ఎకరాల భూమిలో రసాయనాలు లేని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ, అంతరించిపోతున్న మన పూర్వీకుల నాటి మంచి బియ్యం రకాలను కాపాడుతున్నారు.
#GoodNews #SudhanshuDey #Sundarbans #OrganicFarming #DesiSeeds #FarmerHero #SustainableAgriculture#💪పాజిటీవ్ స్టోరీస్ #my status #📰జాతీయం/అంతర్జాతీయం


