Rochish Sharma Nandamuru
*ఆది దంపతులు*
🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊
ఈ సృష్టిలో మెదటి ప్రేమకధ సతి శివుల నుండి ప్రారంభం అయినది అని చెప్పాలి.
సతి దక్షప్రజాపతి ముద్దుల కుాతురు. అతి గారబంగా ఆమెను పెంచసాగాడు దక్షుడు. ఎంతోమంది పుత్రికలు వున్న దక్షుడికి సతిదేవి అంటే మహా ఇష్టం. ప్రజాపతి అయినందున ప్రజలకు ఎల్లవేళలా నియమాలు రూపొందిస్తూ రాజ్యాధికార విధులలతో ఎప్పుడు తీరిక లేకున్నా సప్తరుషులతో ఎప్పుడు సమావేశాలు జరుపుతూ వున్నప్పటికినీ సతీదేవితో మాత్రం ఆటలు వినోదాలతో సమయం గడిపేవాడు దక్షప్రజాపతి
సతి అందమైన బాలిక, కళ్ళు కలువరేకులు కనురెప్పలు చేపల వలె కదులుతూ వుండేవి. అమాయకత్వం వినయవిధేయతలు అందం సౌకుమార్యం లావణ్యంతో ముగ్దమనోహరంగా వుండేది. సతి తన స్నేహితులతో ఎప్పుడుా ఆటపాటలతో ఆనందంగా గడిపేది. చెలికత్తెలు ఆమెను రంగురంగు పుాలతో అలంకరించేవారు. సుగంధద్రవ్యాలు అత్తరు అద్దెవారు చందనంతో లేపనాలు పుాసేవారు. పట్టువస్త్రాలు, నగలు ఆభరణాలు రత్న వజ్ర నవరత్నాలు ధరించేది. సతికి కొంచెం వయస్సు వచ్చింది, ఏదో ఏదో భావాలు కలిగేవి. సాధువుల్ని చాలా అభిమానించేది. రుద్రాక్షల్ని చూస్తే అవి ధరించాలని చాలా ఇష్టపడేది. ఆకాశంలో మేఘాలు కమ్మినప్పుడు కదులుతున్నప్పుడు ఏదో ఒక ఆకారం ఆమెను కలవరపెట్టెది. ఆ ఆకారం మరి ఎవరిదో కాదు శివుడని ఆమెకి తెలియదు, ఢమరుకద్వని వినిపించినప్పుడు సతి అటు వైపుకి వెదికేది. అలా సతి శివుడికి సంభందించిన వస్తువులు ధ్వనులు పట్ల ఆకర్షితులవడం జరిగేది. కారణం సతి శివుడికి దగ్గర కావాలని ప్రకృతి ఆమెలో అలజడి కలిగించేది. క్రమంగా క్రమంగా సతి శివుడికి సంభందించిన వస్తువులు ద్వనులు కోసం వెదుకుతుా వుండేది..
దక్ష ప్రజాపతి కేవలం శ్రీమన్నారాయణుడు ని పుాజించేవాడు. వారే సృష్టి స్థితి లయ అని భావించేవాడు. త్రిముార్తులలో శివుడు కుాడా ఒకరు అనే విషయం దక్షుడు ఒప్పుకునేవాడు కాదు. అతని రాజ్యం లోని ప్రజలు అన్య దైవాన్ని ఆరాధించకుడదు. కేవలం విష్ణుమూర్తికి మాత్రమే పుాజలు చేయాలని ఆంక్షలు విధించేవాడు. ఒకవేళ ఎవరైనా శివుడుని పుాజించినట్లు తెలిసిన వెంటనే వారిని కఠినంగా శిక్షించేవాడు, దక్షుడికి అహంకారం గర్వం మదం కాని దక్షుడుకి ఒక విషయం తెలియదు నారాయణుడి హృదయంలో శివుడు…శివుడి హృదయంలో నారాయుణుడు కొలువై వుంటారని ..
శివుడిపట్ల ద్వేషం పెరిగిపోతుండేది దక్షుడికి. శ్మాశనంలో వుంటాడని కాపాలికుడని బిక్షగాడని , జంతు చర్మాలను ధరిస్తాడనీ నాణ్యమైన వస్త్రాలు నగలు ధరించడనీ, బుాడిద పుాసుకొని పిచ్చివానివలె జఠాఝాటం ధరిస్తాడు అని దక్షుడుకి నిర్లక్ష్యం కాని శివుడే లయ కారకుడనీ శివుని వలనే లోకాలు రక్షింపబడుతాయనీ తెలియదు. అది తెలియక పోవడం అజ్ఞానం , అహంకారం !!
దక్షుడు ఒకనాడు ఒక ప్రత్యేక పుాజ కోసం సతిని అడవి నుండి బ్రహ్మకమలాలను తీసుకురావాలని చెప్తాడు. ఎందుకంటే అవి సతి వ్రతం చేసి మడిలో తీసుకురావాలి. మిగతా పరిచారికలు ఆమెకు తోడుగా కాపలా వుంటారు అలా అడవికి వెళ్లిన సతికి అక్కడ ఒక పులి దాడి చేయబోతుంటే ఒక వ్యక్తి వచ్చి దాన్ని కనుసైగతోనే పొమ్మంటాడు.
ఆ వ్యక్తి మరి ఎవరో కాదు పరమశివుడె. ఇక తనను కాపాడిన శివుడిమీద ఇష్టంఎర్పడ సాగింది ఒకనాడు కొందరుా భక్తులు వసంత పంచమి ఉత్సవాల కోసం ఆనంద తాండవం చేస్తంటే సతి ఆ తాండవంలో పాల్గొని నాట్యం చేసింది. ఆ నాట్యం సమయంలో శివుడు కుాడా ఆమెతో నాట్యం చేసాడు. ఇద్దరు తన్మయత్వంతో నాట్యంలో లీనమై పోయారు.
సతి ఒకసారీ వానలో ఆడుతుా తోటలో విహరిస్తున్నప్పడు శివుడు అక్కడకి వచ్చాడు. అలా ప్రతిచోట శివుడు ఎదురు పడేవాడు. క్రమంగా సతికి శివుడంటే గాఢమైన ప్రేమ కలిగింది. ఒక్కరోజు కూడా శివుడిని చుాడకుండా ఉండలేక పోయెది, అలా విరహ జ్వాలలతో తపించిపోతున్న సతిని దక్షుడు చుాసాడు.
దక్షుడు ఆమెను అంతఃపురం నుండి బయటకు రాకుండా అగ్ని మధ్యలో సతిని వుంచి బంధించాడు. శివుడి వచ్చి సతిని అగ్ని గుండం నుండి బయటకు తీసుకువచ్చి కమిలిన ఆమె చర్మానికి లేపనం రాసేవాడు, అలా అలా సతి శివుడు ఒకరితో ఒకరు గాఢ ప్రేమలో మునిగిపోయారు. ఈ విషయం సకల దేవతలకి రుషులకి తెలిసిపోయింది. ఇక సతిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని భావించి వారు అందరుా దక్షుడు దగ్గరకి వెళ్లి విషయం చెప్పినప్పుడు దక్షుడు అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. కానీ సతీ అన్నపానీయాలు మాని మెండి పట్టుదలతో వుండటం చుాసి చేసేది లేక చివరికి వివాహం జరిపిస్తాడు. కాని ఆ వివాహంలో ఎలాంటి సంప్రదాయాలు, విధివిధానాలు లేకుండా చేస్తాడు, వివాహం ముగిసిన వెంటనే తన కుమార్తె ఈ క్షణం నుండి మరణించిందని ప్రకటిస్తాడు.
వివాహం చేసుకున్న సతి కైలాసానికి వచ్చింది అక్కడ పట్థు పరుపులు లేవు. అంత మంచుకొండ. నంది ప్రమదగణాలు ఆమెకి స్వాగతం చెప్పారు. వివాహం అయిన తరువాత జరిగే శోభనానకి కైలాసం అంత సుగంధ పరిమాళాలతో అలంకరించబడింది. అలా సతి శివుడు దగ్గరయ్యే సమయంలో, యుద్దభేరి శబ్దాలు మెాగాయి. రాక్షసులు దేవతలకి మధ్య ఘోరంగా యుద్దం సాగుతుంది. దేవతలు తమను కాపాడాలని శివుని వేడుకుంటున్నారు. ఆ ప్రార్దన శివునికి వినిపించింది. వెంటనే శివుడు సతిని వదిలి యుద్ద రంగానికి వెళ్లి పోయాడు. అలా సతి శివుడి కోసం కొన్ని నెలల పాటు ఏదురు చుాసింది, తనలో బాధ వేదన కలగసాగింది. సతికి నిరుత్సాహం కలిగేది, శివుడి కోసం దుఃఖంలో మునిగిపోయింది..
శివుడు యుద్దం నుండి వచ్చాక అలిగింది. కాని శివుడు సతిని ఓదారుస్తుా తన బాధ్యత లోకాలను కాపాడటం అని చెప్పెవాడు, లోకాలను కాపాడే బాధ్యత నీవు తీసుకొని లోక మాతవి కావాలనేవాడు. దానికి తగ్గ శక్తులు కోసం యెాగాభ్యాసం ద్యానం చేయాలని సతికి సుాచించాడు శివుడు. అలా ఒక పరిపక్వత వచ్చినాక నాలొ నీవు ఐక్యం అవగలవు అనేవాడు. అలా ధ్యానం చేయమన్నప్పుడు సతికి మనసు నిగ్రహం కలిగేది కాదు..
ఇలాంటి సమయంలో దక్షుడు ఒక యజ్ఞం తలపెట్టాడనీ లోకకళ్యాణం కోసం చేసే ఆ యజ్ఞానికి దేవతలను గంధర్వులు రుషులు నాగులు యక్షులు గుంపులుగా ఆకాశమార్గంలో తరలిపోవడం సతి చుాసింది.. అందరికీ ఆహ్వానం అందింది కాని ఒక్క పరమశివుడికి కైలాసంలోని వారికి మాత్రం ఆ ఆహ్వానం అందలేదు. కాని సతి తన పుట్టింటిలో జరిగే యజ్ఞానికి పోవాలని కోరుకుంటుంది. ఆ విషయం శివుడికి చెప్పినప్పుడు శివుడు పిలవని పేరంటానికి వెళ్ళవద్దని వారిస్తాడు. కాని సతి మెండి పట్టుదల వలన శివుడు నందిని తోడుగా ఇచ్చి పొమ్మంటాడు.
సతి యజ్ఞశాలకి వచ్చినప్పుడు తన అక్కలు కాని తన పరిచారికలు ఎవరుా పలకరించలేదు. స్వాగతం కుాడా చెప్పలేదు. అయిన సతి తన ఇంట్లో తనకు స్వాగతం ఏమటనీ అనుకొని నేరుగా యజ్ఞశాలకి వెళ్లింది, అక్కడ దక్షుడు సతిని ఎవరుా పిలిచారు. ఎందుకు వచ్చావనీ అడిగాడు…
శ్మశానంలో తిరిగే కపాలికుడితో వుండే నీకు యజ్ఞంలో పాల్గొనే అర్హత లేదన్నాడు సతిని అవమానించాడు. శివుడిని దుాషించాడు. సతి తన తండ్రి శివుడిని అలా దుాషించటాన్ని సహించలేకపోయింది. ఆమె సహనం కోల్పయింది. యజ్ఞంలోకి దుాకి ఆత్మహత్య చేసుకుంది, ఆ అగ్నిలో దహించుకొని పోయింది. విషయం తెలిసి శివుడు రుద్రుడై పోయాడు, ఇక ఆ యజ్ఞశాల కాస్తా యుద్దరంగంగా మారిపోయింది.
సతి కాలిన దేహం ముందు శివుడు గట్టిగా రోదించాడు, దిక్కు తోచక సతి లేని జీవితం జీవించలేక సతి దేహాన్ని భుాజాన వేసుకొని లోకాలన్ని పిచ్చి వాడై తిరుగుతున్నాడు, యుగాలు గడిచిపోతున్నాయి. శివుడు సతిని భుాజాన వేసుకొని తిరుగుతుా భుామి లోకానికి వచ్చాడు…!!
తరవాత లోకంలో శివుడి బాధ్యతలు కరువైనాయి కనుక ప్రజలు ఆపదల్లో కష్టాలలో చిక్కు కుపోయారు. విషయం తెలుసుకొన్న విష్ణువు సతి దేహాన్ని 52 ఖండాలుగా చేసాడు. అవి భుామి మీద పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా మారినాయి.
ఇక శివుడు సతి పార్దివదేహం వదిలాక మెుాహం వీడి మాయను క్రమంగా జయించి హిమాలయ పర్వత ప్రాంతంలోని రహస్య గుహలో ధ్యాన నిముగ్నుఢైనాడు.
కాలగర్భంలో యుగాలు దొర్లిపోయాయి, సతి హిమవంతుని పుత్రికగా జన్మించింది, హిమవంతుని పుత్రిక కనుక హైమవతి అని అంటారు. పర్వత రాజు పుత్రిక కనుక పార్వతీ అని పిలిచేవారు. పార్వతి క్రమంగా పెద్దదయింది. హిమవంతుడు శివుడికి సేవలు చేసెందుకు పార్వతిని నియమిస్తాడు, పార్వతి శివుని చుాసాక పుార్వజన్మ జ్ఞాపకం వలన తను అపరిపక్వ మనసుతో శివుడికి దుారమైందనీ తెలుసుకొని ఇక ఈ జన్మలో పరిపక్వత సాధించడం కోసం శివుడిని పొందటం కోసం ఘెారమైన తపస్సు ధ్యానం చెసింది. శరీరం శుష్కించి పోయెాదాక ధ్యానం చేసింది కేవలం ఎండిపోయిన ఆకులు తిని ద్యానం, చేసింది కనుక అపర్ణ అని అంటారు, యెాగ నిష్టలో సకల శక్తులు సాధించింది. అపరిపక్వ మనస్థితి నుండి పరిపక్వ స్తితికి చేరింది. గత జన్మలో చేసిన పొరబాట్లను సరిదిద్దకోవాలనుకుంది. శివుడుని వివాహానికి ఒప్పించింది. ఎన్నో పరీక్షల తర్వాత ఎట్టకేలకు పార్వతీ సకల సంప్రదాయాలతో సకల లాంఛనాలతో వివాహం చేసుకుంది. శివుడిని వివాహం చేసుకొని లోకమాత బాధ్యతలు తీసుకొంది….!!
కళ్యాణం జరగడంతోటే తలనుంచి కాలివరకు తన మేనిలోని సగ భాగాన్ని ఆమెకు ఇచ్చి తానూ అర్ధనారీశ్వరుడయ్యాడు పరమేశ్వరుడు .
ఆయన ఒంటినిండా బూడిద పూసుకుంటే, ఈమె సుగంధభరితమైన మైపూతలు పూసుకుంటుంది. ఈమె పట్టుచీరలు ధరిస్తే, ఆయనేమో నారచీరలో పులిచర్మాన్నో చుట్టుకుంటాడు, ఆయన తలలో చంద్రవంక ఉంటె, ఈమె తలలో చేమంతి పూలను దాలుస్తుంది. ఈమె మెడలో విలువైన రత్నాభరణాలను ధరిస్తే, ఆయనేమో మెడనిండా పాములు వేలాడేసుకుంటాడు. ఆవిడగారు సింహాన్ని వాహనంగా చేసుకుంటే , ఆయనేమో నందీశ్వరుడుని అధిరోహిస్తాడు. ఇలా ఎన్ని భేదాలుంటే ఏం ...
ఆయన వాక్కు అయితే ఆమె ఆ వాక్కుకు అర్ధం, ఆయన ఆధిభిక్షువువయితే, ఈమె అన్నపూర్ణదేవీ. ఆయన మహాకాళేశ్వరుడైతే, ఈమె మహాకాళి.ఇలా పార్వతీ పరమేశ్వరులు ఒకరి ప్రేమకు మరొకరు ప్రతిరూపంగా, అది దంపతులుగా, అచ్చమైన ప్రేమకు ప్రతీకలుగా ప్రణయ మూర్తులుగా ప్రణవంగా ప్రాణంగా లోకాలను అనుగ్రహిస్తున్నారు .
ప్రేమ అంతే అది, ఎన్నెన్ని పరీక్షలు, ఎంతెంత నిరీక్షణలు కలిగించినా అన్నింటిని తట్టుకున్నారు, లోకాలన్నింటినీ ఆశీర్వదిస్తున్నారు..
*ఓం నమః శివాయ*
🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸 #🌅శుభోదయం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🔱శివ పార్వతులు #😇శివ లీలలు✨