ShareChat
click to see wallet page
search
ప్రజలు ఓటు వేసి గెలిపించింది తమ సమస్యలు తీర్చడానికి, సెట్టింగుల మీద జడ్జిమెంట్లు ఇవ్వడానికి కాదు. రోజా గారి విషయంలో విమర్శలు చేసే అదే నోళ్లతో, ఇతర నాయకులు అదే పని చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎమ్మెల్సీగా ప్రజాధనం తీసుకుంటూ, పార్ట్ టైమ్ జాబ్ లాగా టీవీ షోలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. మంత్రి పదవి చేపట్టాక రోజా గారు తన ప్రొఫెషనల్ లైఫ్‌ని పక్కన పెట్టి ప్రజా సేవకు అంకితమయ్యారు. కానీ పవన్ కళ్యాణ్, నాగబాబు వంటి వారు పదవుల్లో ఉంటూనే సినిమాలు, షూటింగులు చేస్తున్నారు. మీ నాయకుడు చేసే తప్పును కూడా 'సూపర్' అంటూ చప్పట్లు కొట్టడం వల్ల సమాజానికి ఒరిగేదేమీ లేదు. ముందు వారిని ప్రశ్నించడం నేర్చుకోండి. #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #జనసేన #టిడిపి