#✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,
తేది ... 20 - 4 - 2026,
వారం ... ఇందు వాసరే (సోమ వారము),
శ్రీపరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
శుక్ల పక్షం,
తిధి : తదియ ఉ 11.05 వరకు
తదుపరి చవితి
నక్షత్రం : కృత్తిక ఉ 8.00 వరకు
తదుపరి రోహిణి
యోగం: సౌభాగ్యం రా 7.57 వరకు
తదుపరి శోభనం
కరణం : గరజి ఉ 11.05 వరకు
వణిజ రా 9.53 వరకు
వర్జ్యం : రా 10.54 - 12.23 వరకు
దుర్ముహూర్తం : మ 12.23 - 1.13 వరకు
మ 2.52 - 3.42 వరకు
అమృతకాలం : ఉ 5.46 - 7.16 వరకు
తె 3.21 - 4.51 వరకు
రాహుకాలం : ఉ 7.30 - 9.00 వరకు
యమగండం : ఉ 10.30 - 12.00 వరకు
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం:6.12
*నేటి విశేషం*
పరశురామ జయంతి,
అక్షయతృతీయ,
సింహాచల చందనోత్సవం.
*నేటి మాట*
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః
గురుచరిత్ర - 79
గురుమూర్తి త్రయంబక క్షేత్రము నుండి నాసిక చేరినారు.
అక్కడ పురాణ మహిమలు గల అనేక క్షేత్రములు ఉన్నవి.
ఆ క్షేత్రముల గురించి సంక్షిప్తముగా చెప్పెదను నామధారక.
గోదావరి మహిమ లోకములో అపారము.
ఆ గోదావరి తట ద్వయమును వృద్ధ గంగ అందురు.
అందులో అపరిమితములైన తీర్ధములు కలవు.
ఆ నది సర్వేశ్వరుని జట యందు నివసించుచూ కిందకు అవతరించెను.
ఋషీశ్వరుడైన గౌతముడు పూర్వము ప్రతిదినము ధాన్యమును చల్లి అక్కడే తపస్సు చేయువాడు.
ఆ చల్లిన ధాన్యము మొలకలై ఆ దినమందే ఫలించును.
గౌతమ మహర్షి మంత్రమహిమ అటువంటిది.
ఒకప్పుడు మునులందరూ కలిసి,
ఈ గౌతముడు శివభక్తుడు.
మహాముని.
ఇతడు గంగను భూమికి తెచ్చినచో మనందరికి ఇక్కడే గంగాస్నానం సమకూరును.
యోగయుక్తులు, ఊర్ధ్వ రేతస్కులైన మునులకు లభించు సద్గతి గౌతమీ తీర వాసులైన జంతువులకు కూడా లభించగలదు.
ఊర్ధ్వ రేతస్కులైన మునులు కోటి సంవత్సరములు చేయగా వచ్చు తపః ఫలము గౌతమీ స్నాన మాత్రముననే సిద్ధింపగలదు.
ఈ గౌతమ మహాముని గంగను భూమికి తెచ్చు ప్రయత్నము చేయగలడు.
కాబట్టి, గౌతమునకు ఏదో ఒక సంకటము తెచ్చినచో మనకు గంగా లాభము కలుగును.
అని వారందరూ తలచి,
దూర్వాలతో ఒక మాయా గోవత్సమును చేసి,
గౌతముని సస్యభక్షణమునకు వారు ప్రోత్సహించిరి.
అనుష్టానమున ఉన్న గౌతముడు సస్యమును భక్షించుచున్న గోవత్సమును దర్భతో మరలింపబోయినాడు.
ఆ దర్భ దూర్వారమైన శస్త్రముగా మారి వజ్రాయుధం వలె ఆ గోవత్సమును తాకెను.
వెంటనే గోవత్సము పంచత్వమును పొందినది.
గోహత్యాపాతకము గౌతమునకు వచ్చినది.
ఋషులందరూ కలిసి సమావేశమై గోహత్యకు ప్రాయశ్చిత్తముగా గంగను తెచ్చి గోవు మీద ప్రవహింప చేసినచో శుద్ధి అగును అనిరి.
గౌతముడు అట్లే అని వెళ్ళి, వేయి సంవత్సరములు తపము చేసినాడు.
వ్యోమకేశుడు ప్రసన్నుడై వరము అడుగమనినాడు.
నీవు ప్రసన్నుడవైనచో చరాచరములను ఉద్ధరించుటకు గంగను భూమండలమునకు అర్పింపుము.
గౌతముని వాక్యమునకు సంతుష్టుడైన ఈశ్వరుడు గంగను సమర్పించినాడు.
ఆ గంగ భూలోకములో మనుష్యుల పాపములను పోగొట్టుచూ భాగీరథి వలె దక్షిణ భారతమున ప్రవహించెను.
ఆ గంగయే గౌతమి, గోదావరి అను పేర్లతో ప్రసిద్ధి పొందెను.
ఆ నదుల మహిమ వర్ణింప ఎవరికి తరము కాదు.
అందుచేతనే నామధారకా! శ్రీగురునాధులు అచ్చటకు వచ్చినారు.
లోకానుగ్రహ కాంక్షతో సర్వతీర్థములను పర్యటించుచూ మంజరీక క్షేత్రమున ఉన్న మాధవారణ్యమును చేరినారు.
సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏


