ShareChat
click to see wallet page
search
*🪹యెషయా🪹* *(📜ప్రవచనము💝)* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *యెషయా గ్రంథం గురించి షార్ట్ మెసేజ్ లో పూర్తి వివరణ👇ఈ వ్రంధములో బైబిల్ మొత్తం మనకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చదవండి షేర్🙏చేయండి🤝* *1️⃣ఎవరు వ్రాశారు:* యెషయా *2️⃣ఎప్పుడు వ్రాశారు* : క్రీ॥పూ॥ 739-681 సం॥లలో *3️⃣ఏది మూల వాక్యము* : మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. (యెషయా 53:5) *4️⃣ఏది మూల పదం* : దేవుని ప్రజలు సమకూర్చబడుట, రక్షణ వాగ్దానం. *5️⃣ఎవరు ముఖ్యమైన వ్యక్తి* : యెషయా *6️⃣ఏమిటి యెషయా అనే పేరుకు అర్థం* : యెహోవాయే నా రక్షకుడు/దేవుడే రక్షణ *7️⃣ఎందుకు వ్రాశారు?* అష్షూరీయులు తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యములను స్వాధీనం చేసుకుంటూ ఇశ్రాయేలు మీదికి కూడా దండెత్తి క్రీ॥పూ॥ 720 సం॥లో సంపూర్తిగా తమ స్వాధీనం చేసుకొనిరి. ఆ సమయంలోనే అధిక భాగము జనులను వారు చెరగొనిపోయారు. ఇశ్రాయేలీయుల పతనము తరువాత యూదారాజ్యమునకు కూడా దేవుని తీర్పు జరుగునని, జనులు దేవునివైపు తిరిగితే మెస్సీయా ద్వారా రక్షణ కలుగునని, అందుకు దేవునియందు కలిగియుండవలసిన విశ్వాసము గురించిన సంగతుల గూర్చి యెషయా ఈ గ్రంథములో లిఖించెను. పద్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్యం వర్ధిల్లుతున్నప్పుడు వ్రాయబడ్డాయి. కానీ ప్రవక్తల గ్రంథాలు ఇశ్రాయేలు ప్రజలు దుర్భర దుస్థితిలో ఉన్నప్పుడు వ్రాయబడెను. ఇశ్రాయేలు ప్రజలు దుస్థితిలో ఉన్నప్పుడు వారిని ఉద్దరించడానికి, ఉజ్జీవింపజేయడానికి దేవుడు ప్రవక్తలను పంపెను. "అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను, వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి" *2 రాజులు 17:13,14.* నూతన నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చెను అనే మాట పలుమార్లు మనం చూస్తాం. దేవుడు చేసిన నిబంధనను మీరి జీవిస్తున్న తన ప్రజలను బహు ధైర్యముతో హెచ్చరిక చేయుటకు దేవుడు యెషయాను ప్రవక్తగా ఏర్పర్చుకొనెను. వారిలో నలుగురు పెద్ద ప్రవక్తలుగా, 12 మంది చిన్న ప్రవక్తలుగా పిలువబడిరి. వారి పరిచర్య కాలము, గ్రంథాలను బట్టే పెద్ద, చిన్న అనే పేరు వచ్చెను. *8️⃣ఏమి సూచిస్తుంది?* ప్రభువైన యేసుక్రీస్తును వధకు తేబడిన గొర్రెగా, మహిమపరచబడిన సేవకునిగా, సమాధానకర్తగా, మెస్సీయగా ఈ గ్రంథము సూచిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మొత్తం పుస్తకాల సంఖ్య 66. ఈ యెషయా గ్రంథములో ఉన్న మొత్తం అధ్యాయాల సంఖ్య కూడా 66. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ధర్మశాస్త్రము గూర్చి, ధర్మశాస్త్రమును మీరినటువంటివారు పొందుకునే శిక్ష గూర్చి తెలియజేస్తే ఈ యెషయా గ్రంథంలోని *మొదటి 39 అధ్యాయములు 'దేవుని తీర్పు' శిక్షను గూర్చి తెలియజేస్తాయి.* *క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు దేవుని ప్రేమను గూర్చి, దేవుని కృపను గూర్చి, దేవుని క్షమను గూర్చి తెలియజేస్తే అదే రీతిగా యెషయా గ్రంథంలోని రెండవ భాగమైన 27 అధ్యాయములు దేవుని ప్రేమ, క్షమ, కనికరమును గూర్చి వ్రాయబడెను.* ప్రవక్తల కాలము 500 సం॥రాలు (క్రీ॥పూ॥ 950-450 వరకు) *9️⃣యెషయా ప్రవక్తగా ఉన్న కాలం...* . *(యెషయా 1:1)* 💥*ఉజ్జియా* . క్రీ॥పూ॥ 790-739 సం|| వరకు *💥యోతాము* . క్రీ॥పూ॥ 739-731 సం॥ వరకు *💥ఆహాజు* . క్రీ॥పూ॥ 731-715 సం॥ వరకు *💥హిజ్కియా* . క్రీ॥పూ॥ 715-686 సం॥ వరకు *🔟యెషయా అద్భుతమైన ప్రవక్త👇* *1.పశ్చాత్తాపం* (యెషయా 6:5) *2.పరిశుద్ధపరచబడడం* యెషయా 6:5 *3.పరిచర్యకు సిద్ధం* (యెషయా 6:8) *4.పంపించడం* (యెషయా 6:9) *5.ప్రార్ధించడం* (2దిన 32:20) యెషయా సుమారు 60 సం॥లు ప్రవక్తగా పనిచేశాడు. పైన తెలుపబడిన ఈ నలుగురు రాజుల పరిపాలనా కాలంలో యెషయా ప్రవక్తగా ఉంటూ రాజులను, ప్రజలను సరిచేస్తూ, హెచ్చరిస్తూ, దేవుని వర్తమానాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు. తనకివ్వబడిన బాధ్యతలు అద్భుతముగా నిర్వహించాడు. యెషయా ప్రవక్తగా తాను పనిచేస్తున్న ఆ రోజుల్లో హోషేయ, మీకా సమకాలీన ప్రవక్తలుగా ఉండేవారు. *💥యెషయా ప్రసంగ సారాంశము:💥* “యెహోవాయే మా రక్షణ". కొన్ని అధ్యాయాల్లో దేవుని తీర్పు, ఉగ్రతను గూర్చి, ధర్మశాస్త్రము, శిక్షను గూర్చి వ్రాయబడ్డాయి. అదే సమయంలో దేవుని రక్షణ, క్షమాపణ ఎలా పొందుకోవచ్చునో వ్రాయబడింది. అనగా శిక్షలేనిదే రక్షణకు విలువలేదు, అవసరము లేదు. *1️⃣1️⃣యెషయా గ్రంథములో ప్రభువైన* *🩸యేసుక్రీస్తు యొక్క ఆనవాలు* *1. ఆయన జననము* (యెషయా7:14; 9:6) *2. ఆయన కుటుంబము* (యెషయా 11:1) *3. ఆయన అభిషేకము* (యెషయా11:2) *4. ఆయన స్వభావము* (యెషయా11:3,4) *5. ఆయన సిలువ మరణము* (యెషయా 53) *6.ఆయన పునరుత్థానము* (యెషయా 25:8) *7.ఆయన పాలన* (యెషయా11:6-9) *పాత నిబంధన* యొక్క ప్రవచనాత్మక భాగములో ఉన్న 17 పుస్తకాలలో (యెషయా నుండి మలాకీ) యెషయా గ్రంథము మొదటిది. మనం తెలుసుకున్నట్లుగా యెషయా గ్రంథము రెండు భాగాలుగా విభజించబడింది. కాని వాస్తవంగా యెషయా తన గ్రంథమును అధ్యాయములుగా విభజింపలేదు. సగటు వ్యక్తి బైబిల్ను తేలికగా చదువగలుగునట్లు కొన్ని శతాబ్దాల క్రితమే అధ్యాయములు, వచనములుగా విభజించడం జరిగింది. యెషయా గ్రంథము మొదటి భాగములో పాత నిబంధన ప్రవచనములు కనిపిస్తే రెండవ భాగములో క్రొత్త నిబంధన ప్రవచనములు మనం చూస్తాము. *యెషయా గ్రంథములో 6వ అధ్యాయము మొదటి భాగములో అతి ముఖ్యమైన అధ్యాయము,* ఇందులో యెషయా ప్రభువును సింహాసనము మీద చూశాడు, ఆ తరువాత ఆయనను సేవించుటకు పిలువబడ్డాడు. ఇది ఇలా ఉండగా రెండవ భాగములో *53వ అధ్యాయము అతి ముఖ్యమైనది.* ఈ అధ్యాయములో యేసయ్య ఏరీతిగా వధకు తేబడిన గొఱ్ఱవలె యొద్దకు కొనిపోబడి, వధించబడుట మనం చూస్తాము. ఈ పుస్తకములో ప్రత్యేకముగా దేవుని గూర్చి "సైన్యములకధిపతియగు యెహోవా” అని 62 సార్లు, “ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు" అని 30 సార్లు మనకు కనిపిస్తాయి. *1️⃣2️⃣యెషయా గ్రంథంలో యేసయ్య ప్రస్తావన* *🩸యేసయ్య జన్మను గూర్చి* 7:14 *🩸యేసయ్య సువార్తను గూర్చి* 61:5 *🩸యేసయ్య మరణము గూర్చి* 53:1-13 *🩸యేసయ్య రాకడను గూర్చి* 60:2-3 *యేసయ్య రాజ్యము గూర్చి* 66:22 *💥యెషయా 1-39 అధ్యాయాలు* (పాతనిబంధనకు సూచన) *💥యెషయా 40-66 అధ్యాయాలు* (క్రొత్తనిబంధనకు సూచన) *పరిశుద్ధ* గ్రంథంలోని నూతన నిబంధనలో మత్తయి వ్రాసిన సువార్త, మార్కు వ్రాసిన సువార్త అని ఎలా పేర్లు ఉన్నాయో అలాగే పాత నిబంధనలో “యెషయా వ్రాసిన సువార్త" అని యెషయా గ్రంథానికి మరో పేరు కలదు. యెషయా గ్రంథములో రక్షణను గూర్చి 26 సార్లు లిఖించబడియుండగా మిగిలిన వాటిలో కేవలం 8 సార్లు మాత్రమే రక్షణను గూర్చి ప్రస్తావించడం జరిగింది. అనగా యెషయా రక్షణ గూర్చి మిగిలిన ప్రవక్తల కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చెను. ప్రవక్త యొక్క పరిచర్య సమూయేలుతో ప్రారంభమాయెను. యెషయా మరియు మీకా సమకాలికులు. పరిశుద్ధ గ్రంథములో మొత్తంగా 17 ప్రవక్తల పుస్తకాలు చేర్చడమైనది. ఓబద్యా, యోవేలు, యోనా, ఆమోసు, హోషేయ, యెషయా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, యిర్మీయా ఈ క్రమములో వారి వారి కాలముల ప్రకారం ప్రవక్తలుగా పనిచేశారు. యూదా చెఱకు పోకముందు- ఓబద్యా, యోవేలు, యెషయా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, యిర్మీయా ప్రవక్తలుగా పనిచేశారు. *💥1️⃣3️⃣ప్రవక్తల సందేశం:* 👉దేవుని మాట వినకపోతే చెదరగొట్టబడతారు. 👉చెరపట్టబడినవారు తిరిగివస్తారు. 👉రక్షకుడు అనగా మెస్సీయా వస్తాడు. 👉చెదరిపోయినవారు మరలా సమకూర్చబడతారు. 👉మెస్సీయ ప్రపంచ పాలన. *1️⃣4️⃣ఏ అధ్యాయాలు ఏమి తెలియజేస్తున్నాయి?* *1-6:* ఉజ్జియా, యోతాము రాజులుగా ఉండే రోజుల్లో యెషయా ప్రవక్తగా ప్రవచించిన మాటల గూర్చి *7-14 :* ఆహాజు రాజుగా పరిపాలించే రోజుల్లో యెషయా ప్రవక్తగా ప్రవచించిన మాటల గూర్చి *15-39:* హిజ్కియా రాజుగా పరిపాలించే రోజుల్లో పరిపాలన గూర్చి, అక్కడ ప్రజలను గూర్చి, ప్రవచించిన మాటల గూర్చి *40-66:* దేవుని క్షమ గూర్చి, దేవుని ప్రేమను గూర్చి, దేవుని ప్రణాళిక గూర్చి, దేవుని వాగ్దానములను గూర్చి తెలియజేస్తాయి. మీకు కావాలంటే వాట్సప్ ద్వారా పంపకూడదు WhatsApp Number 7207673134 #📀యేసయ్య కీర్తనలు🎙