Eenadu
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ రాజ్యసభ అభ్యర్థిగా, ఈ రోజు ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది.
ఈ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, బండారు సత్యానందరావు గారు, వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)గారు, జీవీ ఆంజనేయులు గారు, పంతం నానాజీ గారు, వరుపుల సత్యప్రభ గారు మరియు తంగిరాల సౌమ్య గారు ప్రతిపాదకులుగా పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే పరమావధిగా ప్రజాసేవలో లీనమయ్యే అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ మహత్తర బాధ్యతను, నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను రాజ్యసభ వేదికపై సమర్థవంతంగా వినిపించేందుకు సదా అంకితభావంతో పనిచేస్తాను #🟡తెలుగుదేశం పార్టీ