హర్యానాకు చెందిన 'Greenvize' అనే ఒక క్లీన్-టెక్ స్టార్టప్, LPG సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా నీటితో పనిచేసే ఒక సరికొత్త హైడ్రోజన్ స్టవ్ను తయారు చేసింది. సంజీవ్ చౌదరి స్థాపించిన ఈ సంస్థ, 'PEM ఎలక్ట్రోలైజర్' అనే సాంకేతికతను ఉపయోగించి నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్గా అణువులుగా విడగొట్టి, హైడ్రోజన్ ను వేరు చేస్తుంది. ఇలా విడుదలైన హైడ్రోజన్ వెంటనే ఇంధనంగా మారి వంటకు ఉపయోగపడుతుంది.
కేవలం 100ml నీరు, 1 యూనిట్ విద్యుత్తు ఉపయోగించి వంట చేసుకోవడమే ఈ స్టవ్ ప్రత్యేకత. ఇందులో ఎటువంటి గ్యాస్ నిల్వ ఉండదు కాబట్టి పేలుడు ప్రమాదాలు కూడా ఉండవు, పైగా వంట తర్వాత కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడటం వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
ప్రస్తుతం ఈ యూనిట్ ధర సుమారు 1.5 లక్షల రూపాయల వరకు ఉండటంతో, మొదటగా హాస్టళ్లు, టెంపుల్స్ వంటి కమ్యూనిటీ కిచెన్లలో ఉపయోగిస్తారట. ఈ స్టవ్ వల్ల డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా, మన దేశంలో కూడా ఇంధన కష్టాలు తప్పే అవకాశాలు ఉన్నాయట.
#TALRadioTelugu #GoodNews #CleanTech #GreenEnergy #HydrogenFuel #SustainableLiving #EcoFriendly #StartupIndia #touchalife #talradio #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ #📰జాతీయం/అంతర్జాతీయం


