ShareChat
click to see wallet page
search
*లోక్‌సభ ముందుకు 3 కీలక బిల్లులు* * దిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను గురువారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, అమిత్‌ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. ఇందులో లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లు ఉన్నాయి. #news #sharechat
sharechat - ShareChat