
Wiral.media on Instagram: "కియోంఝర్: అది కేవలం అస్థిపంజరం కాదు.. కుళ్ళిపోయిన వ్యవస్థపై ఒక సామాన్యుడు సంధించిన ప్రశ్న! తన అక్క ఖాతాలోని సొమ్ము కోసం ఓ గిరిజనుడు చేసిన పోరాటం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాకు చెందిన జితు ముండా సోదరి రెండు నెలల క్రితం కన్నుమూశారు. ఆమె ఖాతాలో ఉన్న ₹19,300 కోసం జితు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. "ఖాతాదారుని తీసుకురా.. లేదంటే వారసత్వ పత్రాలు చూపించు" అంటూ బ్యాంక్ అధికారులు కనికరం లేకుండా తిప్పి పంపారు. నిరక్షరాస్యుడైన ఆ పేదవాడి ఆవేదన అధికారుల చెవికి ఎక్కలేదు. తన మాట నమ్మడం లేదని భావించిన జితు.. ఆవేశంతో, ఆవేదనతో శ్మశానానికి వెళ్ళి పాతిపెట్టిన సోదరి అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. దాన్ని భుజాన వేసుకుని మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ నేరుగా బ్యాంకు గడప తొక్కాడు. ఆ దృశ్యాన్ని చూసి సిబ్బంది, జనం హడలెత్తిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి అతడిని శాంతింపజేశారు. సోషల�"

