**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 16**
మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **14వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో శ్రీరామచంద్రుడు హనుమంతుని కీర్తిని వేనోళ్లతో పొగుడుతూ అక్కున చేర్చుకోవడం చూశాం. ఆ కీర్తి ఎంతటిదో, ఎవరెవరు ఆయనను స్తుతిస్తారో ఈరోజు చౌపాయి వివరిస్తుంది.
**14వ చౌపాయి**
**సనకాదిక బ్రహ్మాది మునీశా |**
**నారద శా(సా)రద సహిత అహీశా ||**
**ప్రతిపదార్థం:**
* **సనకాదిక:** సనక, సనందన, సనాతన, సనత్కుమారులు (బ్రహ్మ మానస పుత్రులు)
* **బ్రహ్మాది:** బ్రహ్మదేవుడు మొదలైనవారు
* **మునీశా:** గొప్ప మునీశ్వరులు
* **నారద:** నారద మహర్షి
* **శారద:** సరస్వతీ దేవి
* **సహిత:** వీరందరితో పాటు
* **అహీశా:** సర్పరాజైన ఆదిశేషుడు
-----
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
హనుమాన్ చాలీసాలో 'లాయ సజీవన లఖన జియాయే శ్రీరఘుబీర హరషి ఉరలాయే' వరకూ రామకథ. ఇంచుమించు రామాయణంలో హనుమకథ అయింది. అక్కడి నుంచి ఎంతోమంది స్వామిని కీరిస్తున్న వైభవాన్ని చెప్తున్నారు. కీర్తనకు వచ్చే ఫలితం అటు తరువాత వస్తుంది. ఇలా చాలీసాని కొన్ని విభాగాలుగా చేసుకోవచ్చు.
1. **జ్ఞానులు (సనకాదులు):** అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానం కలిగిన సనకాది మునులు కూడా హనుమంతుని కీర్తించారు.
ఎక్కడ ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా రామ రహస్య ఉపనిషత్ లో చెప్పబడ్డ రహస్యాలు. అంటే అనేక సంహితలు,పురాణాలు, ఉపనిషత్ లు తన మనసులో తాదాత్మ్యం చెందించుకుని తులసి దాసు గారు హనుమాన్ చాలీసా మనకు అందించారు అని ఇప్పుడు అర్ధం అవుతోంది.
సనకాది యోగివర్యులు, ఇతర ఋషులు, ప్రహ్లాదాద్యా విష్ణుభక్తాః - ప్రహ్లాదాది విష్ణుభక్తులు - వీళ్ళందరూ కలిసి హనుమంతమథాబ్రువన్ – హనుమంతుని దగ్గరకి వచ్చి నమస్కారం చేసి వాయుపుత్ర! మహాబాహో కిం తత్త్వం బ్రహ్మవాదినాం బ్రహ్మవాదులైనవారు అనగా బ్రహ్మం గురించి చెప్పగలిగిన మహాత్ములు ఏది పరతత్త్వం అని చెప్తారో దానిని చెప్పు అన్నారు.
అంటే వారికి తెలియదా అంటే తెలుసు,నిరంతరం వారు బ్రహ్మాభ్యాసం చేస్తారు. బ్రహ్మాభ్యాసం అంటే బ్రహ్మము గురించే మాట్లాడతారు, బ్రహ్మము గురించే వింటారు వారికి తెలిసినా వింటారు. హనుమంతుడు ఎక్కడ రామాయణం చెప్తున్నా కూర్చుని వింటాడు, తెలియకనా.. ? తెలిసినా వింటాడు.
అందుకే సనకాదులందరూ హనుమ దగ్గరకు వెళ్ళి "బ్రహ్మవాదులందరూ పరతత్త్వమని దేనిని అంటారో దానిని చెప్పు" అని అడిగారు ఒక్కసారి ఆయన తాదాత్మ్యానికి వెళిపోయి ఆ పరతత్త్వమే రామము అని రామతారకబ్రహ్మ రహస్యాన్ని బోధిస్తారు
రామతత్త్వం చెప్పడానికి శివునకు తప్ప ఇంకెవరికీ పూర్ణంగా తెలియదు. పూర్ణంగా రాముని గురించి తెలిసిన శివుడే హనుమంతుడై ఆ రామబ్రహ్మతత్త్వమును చెప్పాడు.
ఆ రామరహస్యంలో వాక్యం తీసుకుని 'సనకాదిక బ్రహ్మాది మునీసా' అని చెప్పారు తులసీదాసుగారు.
హనుమ సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపుడు అయిన పరమేశ్వర అవతారం, లంకా ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతుంటే వాల్మీకి మహర్షి ఈ రహస్యం చెప్తాడు. దక్షిణ ముఖం గల హనుమ దక్షిణ దిశ వైపు ఎగిరాడు అని. దక్షిణ ముఖం ఎవరిది దక్షిణామూర్తి ది.
2. **సృష్టికర్త (బ్రహ్మ):** సనకాదులే కాదు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సైతం హనుమంతుని స్తుతించారు. ఎప్పుడూ ఇదే యజ్ఞం లో గతం లోనే చెప్పుకున్నా, సుందర హనుమ మంత్రం అని బ్రహ్మ గారు లంకిణి నీ పడగొట్టిన తరువాత కర్కటినీ సంహరించిన సమయంలో స్తోత్రం చేశాడు అని.
అదొక్కటే కాదు అగస్త్యసంహితలో హనుమంతునికి సంబంధించిన కవచములు కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినవే. బ్రహ్మదేవుడు హనుమంతుని ఉపాసన చేసినప్పుడు (వింశతి)ఇరవై చేతుల ఆంజనేయస్వామి దర్శనమిచ్చి భవిష్యత్ బ్రహ్మగా రాబోతున్నానని చెప్పారు అప్పుడు హనుమంతునికి సంబంధించిన మంత్రాలెన్నో ఆయనకు దర్శింపజేస్తే బ్రహ్మదేవుడు రచించాడు. అందుకు 'బ్రహ్మాది మునీసా'
3. **భక్తికి నిదర్శనం (నారదుడు):** నిరంతరం నారాయణ నామ స్మరణ చేసే నారద ముని, హనుమంతుని రామ భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు.నారదుడు గొప్ప భక్తశిఖామణి భక్తులకు ఆదర్శప్రాయమైన స్వామివారిని కీర్తన చేశాడు నారదుడు.
నారద సంహిత, నారదపురాణం, నారద పాంచరాత్రం... ఇత్యాది గ్రంథాలలో హనుమంతునికి సంబంధించిన కొన్ని మహిమలు వర్ణింపబడ్డాయి. నారదపురాణంలో హనుమత్కథ ఉంది. నారదుడు హనుమంతుని గానం చేసిన ఘట్టాలు ఆ గ్రంథాలలో కనబడతాయి.
4. **విద్యకు అధిదేవత (శారద):** చదువుల తల్లి సరస్వతీ దేవి కూడా హనుమంతుని బుద్ధిబలాన్ని, వాక్చాతుర్యాన్ని కొనియాడుతుంది.
5. **ఆదిశేషుడు (అహీశ):** తన వెయ్యి నోళ్లతో నిరంతరం హనుమంతుని గుణగణాలను గానం చేస్తూనే ఉంటాడు.
ఆదిశేషువే పతంజలిరూపంతో అవతరించి వైద్యవిజ్ఞానాన్ని, వ్యాకరణశాస్త్రాన్ని యోగశాస్త్రాన్ని మూడింటిని ఇచ్చాడు. ఆయన కూడా హనుమను కీర్తించాడు వ్యాకరణ, యోగ, వైద్యశాస్త్రాలలో ఆంజనేయస్వామి గొప్పవారు.
వేయి తలల విష్ణువు కీర్తించడమే కాదు, వేయి పడగల ఆదిశేషువు కూడా ఆంజనేయుని కీర్తించాడు. అదీ దీనిలోని భావం.
-----
**తులసీదాసు గారి సందేశం:**
హనుమంతుని కీర్తి కేవలం భూలోకానికే పరిమితం కాదు. మునులు, దేవతలు, విద్యాధి దేవతలు, చివరకు ఆదిశేషుడు కూడా ఆయనను స్మరిస్తారు. అంటే, ఒక వ్యక్తి తన హృదయంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకుంటే, లోకంలోని అత్యున్నత శక్తులన్నీ ఆ వ్యక్తికి దాసోహం అంటాయని తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా మనకు అర్థం చేయించారు.
-----
**జై శ్రీరామ్\! జై హనుమాన్\!** #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్


