Mohan
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party 👨🏻🌾 రైతుల పాలిట రాక్షస పాలన ⚠️
📢 అస్తమానం కేసీఆర్ను తిడితే నీళ్లురావు.. కాళేశ్వరం మోటర్లు ఆన్చేస్తేనే నీళ్లొస్తయ్ 🌊
🆘 నిపుణుల హెచ్చరికలు పట్టించుకోని సీఎం, రేవంత్రెడ్డి వల్లే కరువొచ్చింది
📣 దేవుండ్లపై ఒట్టుపెట్టి మాటతప్పిన రేవంత్
✅ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు వద్దు.. మోటర్లు ఆన్చేసి రిజర్వాయర్లు నింపాలి
💥 పాదయాత్రలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్
✊🏻 కాంగ్రెస్ సర్కార్పై కదంతొక్కిన రైతులు. సాగునీటి కోసం మహా పాదయాత్ర
🎯 సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల మహా పాదయాత్ర
రైతుల డిమాండ్ ఒకటే.. కాళేశ్వరం మోటర్లు వెంటనే ఆన్చేయాలి. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్తోపాటు ఇతర అన్ని రిజర్వాయర్లను నీటితో నింపాలి.
గత బీఆర్ఎస్ హయాంలో గోదావరి నీళ్లొస్తే చాలు.. చెరువులు నిండేవి, కాలువలు పారేవి, పంటలు పండేవి. గడిచిన ఆరేండ్లలో కరువు అనే మాట రైతు నోట వినిపించలేదు. వేసవిలో కూడా చెరువులు అలుగులు తొక్కాయి, రెండు పంటలు కాదు.. మూడు పంటలను కూడా రైతులు సాగు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత కరువు సహజ సిద్ధంగా రాలేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ప్రకృతి తెచ్చింది కానేకాదు. రేవంత్రెడ్డి తెచ్చిన కరువు. ప్రభుత్వం సమయానికి కాళేశ్వరం నీళ్లు ఎత్తకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.