ShareChat
click to see wallet page
search
హనుమజ్జయంతి........!! లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతా మూర్తులుగా మనముందు నిలుస్తాయి. ప్రతి దేవతాపాత్ర వెనక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది. అటు వంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు. రుద్రాంశ సంభూతుడిగా శైవులకు, రామకార్య దురందరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు. శారీరకంగా, ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు. వినయశీలి, మహాజ్ఞాని. భౌతికరూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు. బుద్ధి, చపలశక్తులు రెండింటికీ స్థానమైనవాడు. అంజనీపుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు. సూర్యుణ్ని పండు అనుకుని మింగబోతుంటే ఇంద్రుడి వజ్రా యుధ ఘాతానికి పగిలిన హనువు గలవాడిగా హనుమంతుడయ్యాడు. యోగశాస్త్రంలో కుండలినీ యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు. హనుమత్ అంటే సుషుమ్నతో కూడిన యోగి అని అర్థం. హనుమత్ తత్వం మనసుకు ప్రతీక. మనసు నిత్యం చలిస్తుంది. ఈ చాంచల్యాన్ని అరికట్టడానికి నిరంతర సాధన అవసరం. పరమార్థ సాధనకు శ్రీరామచరణారవింద ప్రాప్తికి వానరం వంటి మనసు కూడా ప్రయత్నం చేయవచ్చునని ఆంతర్యం కావచ్చు. అచంచల మనఃస్థితికి ప్రతినిధి మారుతి. లోకంలో ఏ మహాకార్యాన్ని సాధించడానికైనా మొదట అవసరమైంది శక్తి, శక్తి రెండు రకాలు-అది శారీరకం, మానసికం. కేవలం శారీరక శక్తిగాని, మానసిక శక్తిగాని స్వయం సంపూర్ణతను సాధించలేవు. ఆ రెండింటి కలయికే మహాకార్య సాధనకు గట్టి పునాది. ఆంజనేయుడు పుట్టుక తోనే బలవంతుడు. వాయుదేవుడి పుత్రుడు. మానవ జీవన మహేతిహాసం రామాయణంలో సుగ్రీవుడి మంత్రిగా, శ్రీరాముడి దూతగా, అద్భుత పరాక్రమశాలిగా, మంత్రజ్ఞుడిగా, దార్శని కుడిగా దర్శనమిస్తాడు. నిర్భయత్వం, పవిత్రత, ప్రభుభక్తి, ఇంద్రియ నిగ్రహం, విద్యావైదుష్యం-అతడిలో మూర్తీభవించిన లక్షణాలు. ప్రథమ పరిచయంలోనే శ్రీరాముణ్ని ఆకర్షిస్తాడు. హనుమను గురించి శ్రీరాముడు లక్ష్మణుడితో పలికిన మాటలు- అతడి శబ్దజ్ఞానానికి దృష్టాంతాలు. 'రుగ్వేదం చదవనివాడు, యజుర్వేద పరిజ్ఞానం లేనివాడు, సామవేదం అభ్యసించనివాడు ఇంత సుందరంగా మాట్లాడలేడు... ఇతడు వ్యాకరణ శాస్త్రాన్ని అవలోకనం చేసి ఉంటాడు... ఎంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం దొర్లలేదు... ఇతడి వాణి హృదయంలో మధ్యమ రూపంలో ఉండే గళం నుంచి వైఖరిరూపంలో వెలువడు తోంది...'- ఇలా హనుమవాణిని ప్రశంసిస్తాడు శ్రీరాముడు. ఆంజనేయుడిలో సముద్రాన్ని లంఘించగల శక్తి సామర్ధ్యాలతోపాటు, ఆవరో ధాలను దాటగల ఉపాయజ్ఞత ఉండబట్టే-సీతను చూడగలిగాడు. సీతమ్మను చూసి రమ్మంటే లంకనే కాల్చి వచ్చాడు. ఆంజనేయుడు రామభక్తుడు. ఒక పురు షోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు. ఒక మహాకార్యానికి తన శక్తియు క్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసు కున్నాడు. స్వామి కన్నా మిన్నగా మన్నన లందుకున్న సేవకుడు హనుమంతుడు. అయోధ్యలో శ్రీరామపట్టాభిషేకం జరిగాక రాముడు హనుమతో 'కపిశ్రేష్ఠా! నువ్వు నాకు చేసిన ఉపకారాలకు జన్మాం తరం వరకు నేను కృతజ్ఞుడిగా ఉండిపో తాను... నీ ఉపకారాలన్నీ నా శరీరంలో జీర్ణించిపోవాలని ప్రత్యుపకారం చేసుకునే అవకాశం నాకు లభించకుండా ఉండాలని కోరుకుంటున్నాను' అంటాడు. స్వామి, సేవకుల కృతజ్ఞతా బంధాన్ని చెప్పడానికి ఇంత కంటే ఉదాత్తమైన భావం ప్రపంచ సాహి త్యంలో ఎక్కడా ఉండదు. హనుమ, రాముడితో 'ప్రభూ! దేహదృష్టితో నేను మీకు దాసుణ్ని. జీవదృష్టిలో మీ అంశను, ఆత్మదృష్టిలో మీరే నేను...' అన్నాడు. మారుతి వ్యక్తిత్వం ఆధునిక సమాజంలో మానవ వ్యక్తిత్వానికి ఆదర్శప్రాయం. నేటి యువతకు మారుతి మార్గం అనుసరణీయం.🕉️🚩🙏🏻🙏🏻 #🚩సనాతన ధర్మం💪 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #✋బీజేపీ🌷 #🧓నరేంద్ర మోడీ
🚩సనాతన ధర్మం💪 - भीराम ಏಾನುಹಾನ ಜಯಂತಿ శుభాకాంక్షలు भीराम ಏಾನುಹಾನ ಜಯಂತಿ శుభాకాంక్షలు - ShareChat