#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party రైతు బీమాకు మంగళం🤯😤 సాయం కోసం రెండున్నరేండ్లుగా ఎదురుచూపులు
పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ హయాంలో వారంలోనే ఖాతాలోకి
ఇప్పుడు నెలలు గడుస్తున్నా కానరాని పరిహారం
రేవంత్ సర్కార్పై రైతు కుటుంబాల అసంతృప్తి
వికారాబాద్ జిల్లాలో 203 కుటుంబాల వెత
క్షేత్రస్థాయిలో అధికారులను నిలదీస్తున్న వైనం
రైతు బీమా పథకంపై కొరవడిన పర్యవేక్షణ
అందరికీ అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నీరుగారుస్తున్నది. ఏదైనా కారణంతో రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ రైతు బీమా అందించింది. వారంలోనే బాధిత కుటుంబం ఖాతాలో రూ.5 లక్షల బీమా సాయం జమచేసి అండగా నిలిచింది. కానీ రేవంత్ సర్కార్లో రైతుబీమా కోసం బాధిత కుటుంబం నెలల తరబడి ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సాయం అందక ఆవేదనతో పలుచోట్ల బాధిత కుటుంబాలు అధికారులను నిలదీస్తున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతు బీమా సాయం అందడంలో చాలా ఆలస్యమవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో ఎవరైనా రైతు ఏదేని కారణంతో చనిపోతే మరుసటి రోజే ఏఈవోలు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ వివరాలను సేకరించి రెండు, మూడు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి జారీచేసేలా చర్యలు చేపట్టేవారు.


