#🔊తెలుగు చాట్రూమ్😍 #💪పాజిటీవ్ స్టోరీస్ #😃మంచి మాటలు #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #✍️కోట్స్
#మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి. సీఐటీయూ డిమాండ్.
చలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సిఐటియు పిలుపు
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని ధర్నాకు సంబంధించిన కరపత్రాలు కార్మికులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జి. శ్రీనివాసులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మున్సిపల్ అధికారుల వేధింపులు ఆపాలని , ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కార్మిక కుటుంబం వీధిన పడే పరిస్థితి ఉంది. కావున ప్రమాద బీమా ను 25 లక్షల రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 15 లక్షల రూపాయలు, కార్మికులు చనిపోతే దహన సంస్కారాల కింద 30 వేల రూపాయలు చెల్లించాలని, ఇల్లు లేని ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు కేటాయించాలని, సమయానికి జీతాలు చెల్లించాలని, తదితర డిమాండ్లతో తార్నాకలోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు జూన్ 5వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పి. వెంకట్ మున్సిపల్ నాయకులు దశరథ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు


