*తేదీ:: 04.06.2026*
“_వెన్నుపోటు చంద్రబాబు… ప్రజలను మోసం చేసిన చంద్రబాబు డౌన్ డౌన్” నినాదాలతో నగరిలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలో_
_*మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఫైర్*
************************
నగరి పట్టణం టవర్ క్లాక్ కూడలి వద్ద ఈరోజు “ *వెన్నుపోటుకు రెండేళ్లు*” కార్యక్రమంలో భాగంగా *మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా గారి* ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా గారు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎన్నికల ముందు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి “బాబు సూపర్ సిక్స్” పేరుతో మహిళలు, యువత, రైతులు, విద్యార్థులు, ప్రతి కుటుంబానికి అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. నెలకు ₹4,000 పింఛన్, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ప్రత్యేక మద్దతు, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం వంటి పథకాలపై ఈనాడు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇస్తూ ప్రజలను నమ్మించారని విమర్శించారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని రోజా గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు ఇచ్చిన బాండ్లు ఇప్పుడు ఎక్కడ...? మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఎందుకు అమలు కావడం లేదు? ప్రజలను నమ్మించి ఓట్లు తీసుకున్న తర్వాత మాట తప్పడం వెన్నుపోటు కాదా?” అంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో ప్రతులు, చంద్రబాబు–పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే “ *వెన్నుపోటుకు రెండేళ్లు చంద్రబాబు*… ప్రజలను మోసం చేసిన చంద్రబాబు డౌన్ డౌన్” అంటూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో నిరసన చేపట్టారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజల తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. #RK ROJA AKKA #🇱🇸వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ


