ShareChat
click to see wallet page
search
#👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #finance #education #teachers
👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ - ఈనాడు 999939 వారాంతం | 16 రకాల ఎల్డీసీ ఔషధాలు నిషేధించిన కేంద్రం ఈనాడు , దిల్లీ : కేంద్ర వైద్యారోగ్యశాఖ 16 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్స్ ( ఎస్ఓసీ ) ఔషధాలను నిషేధించింది . రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను నిర్ణీత మోతాదులో కలిపి తయా రుచేసే ఈ మందుల వాడకం వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు ఉందన్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు వీటి తయారీ , పంపిణీ , అమ్మకాలను తక్షణమే నిలిపేయాలని నోటిఫికేష న్లో శనివారం వెల్లడించింది . ప్రజారో గ్యాన్ని పరిరక్షించడం , శాస్త్రీయంగా ధ్రువీకరించిన ఔషధాలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడడానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది . ఈ నిషేదాన్ని కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థలు , అధికారులకు ఆదేశాలు జారీచేసింది . తయారీదార్లు . దిగుమతిదార్లు , పంపిణీదార్లు , ఇతర భాగస్వాములు కూడా దీనికి అనుగు జంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది . సుప్రీంకోర్టు ఆదేశా లకు అనుగుణంగా చేపట్టిన ఎన్టీసీల సమీక్ష అనంతరం ఈ మేరకు ప్రభ టన వెలువడింది . చికిత్సకు సమర్థవంతంగా సహకరించని , ప్రజలకు హాని కలిగించే ఔషధాలను గుర్తించేందుకు ఔషథ సాంకేతిక సలహా మండలి ( డీటీఏబీ ) నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు 16 రకాల ఎపీడీసీలను నిషేధించింది . వీటిలో చర్మ సంబంధిత , కండరాల నొప్పి నివారణ మందులు , యాంటీబయాటిక్ ఆధారిత మిశ్రమాలు సహా పలు చికిత్సా విభా గాలకు చెందిన ఔషధాలు ఉన్నాయి . జాబితాలో అదనంగా కలబందతో పాటు విటమిన్ ఈ , జోజోబా , నారింజ , గోధుమ మొలకలు , టీ ట్రీ నూనెలు , అలాంటోనిన్ , పాంథనోల్ వంటి పదార్థాలను కలిపి పలు చర్మ వ్యాధి , చర్మ సంరక్షణ ఔషధాలను తయారుచేయకూడదని తెలిపింది . నవీ ముంబయి నుంచి అబుధాబికి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ తొలి విమానం వచ్చే నెల 15 న ప్రారంభం ముంబయి : కొత్తగా నిర్మించిన నవీ ముంబయి విమానాశ్రయం నుంచి అబుధాబికి ఎయిరిండియా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎక్సప్రెస్ జులై 15 న అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించనుంది . ఈ తొలి విమానానికి బుకింగ్లను త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది . నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ ( ఎన్ ఎంబఏఎల్ ) బి.వి.జె.కె.శర్మ మీడియాతో మాట్లా కోడి గుడు డుతూ , జులై 15 నుంచి ప్రయాణికుల , సరకు 21 న ఫారం వద్ద రైతు అమ్మకం ధరలు ( నెక్ ) | హైదరాబాద్ వరంగల్ విజయవాడ రవాణా సేవల కోసం విమానాశ్రయం అంతర్జా తీయ కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలిపారు . అదానీ గ్రూప్ యాజ మాన్యంలోని నవీ ముంబయి విమానాశ్ర 63 లో మహారాష్ట్ర ప్రభుత్వ పట్టణ ప్రణాళిక , 675 మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అయిన 637 సిడ్కో కూడా 20 శాతం వాటాను కలిగి ఉంది . గత ఏడాది అక్టోబరులో ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని లాంచనంగా ప్రారంభించారు . 2025 డిసెంబరు 25 న దేశీయ వాణిజ్య కార్యకలాపా లను ఇక్కడ ప్రారంభించారు . 635 | తూ / స గోదావరి 625 విశాఖపట్నం చిత్తూరు 708 వాడని డేటాకు రూ .20,000 కోట్లు చెల్లించాలా ? • వినియోగదారుల హక్కుల సంఘాల ఆవేదన • కాల్స్ కోసమే ప్రత్యేక పథకాలు తేవాలి : ట్రాయ్ • సాధ్యం కాదంటున్న టెలికాం సంస్థలు దేశంలో మొబైల్ వినియోగదారులు వినియో గించుకున్నా , లేకున్నా .. డేటా కోసమూ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది . వారికి ఈ అన వసర ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ( ట్రాయ్ ) కీలక ప్రతిపాదన చేసింది . ఇంటర్నెట్ డేటా అ సరం లేని తక్కువ ఆదాయ వర్గాలు . వృద్ధులు , గ్రామీణుల కోసం / పీచర్ ఫోన్లు విని యోగించే వారి కోసం కేవలం వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ సేవలతో కూడిన అత్యంత చౌకైన ' స్టాండలోన్ ' ప్లాన్లను విధిగా తీసుకురావాలని ప్రతిపాదించింది . దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో , భారతీ ఎయిర్టెల్ , వొడాఫోన్ ఐడియా ( వీఐ ) ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి . నిర్ణయాలను మార్కెట్కే వదిలేయాలన్న పాలసీకి ఇది విరు ద్ధమని , ప్రస్తుత టారిప్ విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా , యధాతథ స్థితి కొన సాగించాలని టెల్కోలు కోరుతున్నాయి . యుద్ధనౌకల నిర్మాణ సంస్థకు సగటు రాబడి పెంచుకునేందుకే ' నవరత్న ' హోదా ఒక్కో యోనిపై వచ్చే సగటు రాబడి రుకునేందుకు టెలికాం సంస్థలకు డేటా ఛార్జీలు అధికంగా ఉపయోగపడుతున్నాయి . కొన్నేళ్లుగా తమ వినియోగదారులను బేసిక్ ఫీచర్ ఫోన్ల నుంచి జీ . నీ స్మార్ట్ఫోన్ల వైపు మళ్లించడం ద్వారా , డేటా వినియోగం చేసి , లాభాదాయాలు పెంచుకునేం దుకు టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి . ఈ తరుణంలో తక్కువ ధరకే ' వాయిస్ ఓన్లీ ' పథకాలు తెస్తే , తమ ఆదాయ వృద్ధికి విఘాతం కలుగుతుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి . అందుకే ట్రాయ్ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు . కోల్ కతా : రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిస్టిల్లర్స్ అండ్ ఇంజినీర్స్ ( జీఆర్ఎస్ ) లిమిటెడ్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదా దక్కింది . సుస్థిరమైన పనితీరుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం ఈ హోదాను ప్రకటించినట్లు సంస్థ వెల్లడించింది . కోల్ కతా కేంద్రంగా యుద్ధ నౌకలు నిర్మించే ఈ సంస్థ 2012-28 ఆర్థిక సంవత్సరంలో రూ .7,112 కోట్ల ఆదాయంపై రూ .748 కోట్ల లాభాన్ని పొందింది . అంతర్జాతీయ స్థాయిలో పోటీపడొచ్చు .. చైర్మన్ : వాణిజ్య నౌకలనూ నిర్మించే ఈ నౌకా నిర్మాణ సంస్థ . ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది యుద్ధ నౌకలను అందించింది . ఇందులో మార్చి 311 న ఒకే రోజు మూడు నౌక లను అందించింది . ఇప్పటివరకూ జీఎస్ఈ మొత్తం 118 యుద్ధ కలను రూపొందించగా , అందులో అత్యధికంగా 80 నౌకలు భారత నావికాదళంలో సేవలు అందిస్తున్నాయి . నవరత్న హోదా దక్కడం సంస్థ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి అని గార్డెన్ రీచ్ చైర్మన్ , ఎండీ పి.ఆర్ , హరి పేర్కొన్నారు . ఈ ఉన్నత హోదా .. వ్యూహాత్మక కాశాలను అందుకునేందుకు , రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధిని సాధించేందుకు , అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని ' సటో పేతం చేసేందుకు దోహదం చేస్తుందన్నారు . ఎల్పీజీకి కొత్త దేశాల వైపునకు భారత్ • సరఫరా అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకే • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యం : క్రిసిల్ ఢిల్లీ : పశ్చిమాసియా ఉద్రిక్తతల సమ యంలో గల్ఫ్ ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్ తన ద్రవీకృత పెట్రోలియమ్ గ్యాస్ ( ఎల్పీజీ ) దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ విపణులను గణనీ యంగా పెంచుకుంది . వీటిల్లో అమెరికా , ఇరాన్ సహా పలు ఇతర దేశాలు ఉన్నాయి . అదే సమయంలో అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల భారం నుంచి గృహ వినియోగదారులను ఆదుకోవడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఇందన విక్రయ సంస్థలు ఆ భారంలో చాలా వరకు భరిం చాయి . ఉద్రిక్తతలకు ముందు భారత ఎల్పీజీ దిగు మతుల్లో సుమారు 80 శాతం వరకు పశ్చిమాసియా సరఫరాదార్ల నుంచి జరిగింది . దీనివల్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు ' సరఫరా అంతరాయాల ప్రభా వానికి భారత్ ఎక్కువగా గురయ్యేది . క్రిసిల్ నివేదిక ప్రకారం .. ఏప్రిల్ 20028 నాటికి భారత దిగుమతుల్లో ఆమె రికా వాటా దాదాపు మూడింట ఒక వంతు పెరి గింది . ఇది ఫిబ్రవరిలో కేవలం 8 శాతంగా ఉండేది ... ఏటా 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ సరఫరా కోసం 2025 చివర్లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ఈ మార్పునకు దోహదపడింది . ఇది భారత వార్షిక దిగుమతి అవసరాల్లో సుమారు 10 శాతానికి సమానం . భారత దిగుమతుల జాబితాలో ఇరాన్ కూడా తిరిగి చేరింది . ఏప్రిల్ దిగుమతుల్లో సుమారు 6 శాతం వాటాను ఈ దేశం కలిగి ఉంది . అర్జెంటీనా , చిలీ , ఫ్రాన్స్ , నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి కూడా సరఫరా జరిగింది . ఉద్రిక్తతల సమయంలోనూ సర ఫరా కొనసాగేందుకు భారత్కు దిగుమతి విపణుల వైవిధ్యీకరణ తోడ్పడినప్పటికీ .. దీనివల్ల సరఫరా వ్యవస్థల విస్తరణ , రవాణా ఖర్చులు పెరగడం లాంటి ప్రతికూలతలు ఎదురయ్యాయి . అయినప్ప టికీ ఈ అంతరాయాలు గిరాకీపై తీవ్ర ప్రభావం చూపాయి . లభ్యత పెరగడం , ధరలు పెరగడం వల్ల విని యోగం తగ్గడంతో ఎల్పీజీ వినియోగం ఫిబ్రవరి లోని 32 లక్షల టన్నుల నుంచి ఏప్రిల్ 24.7 లక్షల టన్నులకు పడిపోయింది . 2025-200 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో 332 లక్షల టన్నులకు చేరిన భారత ఎల్పీజీ విని యోగం , మార్చి - ఏప్రిల్ నెలల్లో వార్షిక ప్రాతిపదికన 13 శాతం క్షీణించగా .. మే నెలలో 20 శాతం పడి పోయింది . ఈ క్షీణత ప్రభావాన్ని వాణిజ్య , పారిశ్రా మిక వినియోగదారులు ఎక్కువగా ఎదుర్కొన్నారు . మార్కెట్పై ఆధారపడిన వినియోగదారులు అధిక ధరలు , సరఫరా కొరతకు త్వరగా స్పందించడంతో గృహ వినియోగదార్ల నుంచి గిరాకీ కంటే వాణిజ్య పారిశ్రామిక వినియోగదార్ల వినియోగం మరింత తీవ్రంగా పడిపోయింది వినియోగదారుల వసూలు అనవసరపు భారం టెల్కోల తీరును వినియోగదారుల హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి . బేటా వాడని చేస్తున్న డబ్బును , డేటా వాడేవారికి సబ్సిడీ ఇస్తున్నట్లుగా టారిప్లు ఉంటు న్నాయని ఈ సంఘాలు వాదిస్తు న్నాయి . దేశంలో సుమారు 30-35 కోట్ల మంది ఫీచర్ ఫోన్లు ( కోప్యాడ్ ఫోన్లు ) వాడుతుండగా , వారిలో 10 నుంచి 15 కోట్ల మందికి అసలు ఇంట రెట్ అవసరమే లేదన్నది వినియోగదా రుల సంఘాల అంచనా . అయితే అన్ని ప్రీపెయిడ్ పథకాల్లో డేటాను తప్పనిసరి చేయడంతో .. డేటా వాడని వారు ఏటా సుమారు రూ . 15,000-20,000 కోట్ల వరకు టెల్కో లకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి . ప్రారంభస్థాయి పథ కాల్లో ఒక్కో గిగాబైట్ డేటాకు రూ . 94-99 వార్డ్ వసూలు చేస్తున్నారని , ప్రీమియం పథకాల కంటే , ఇవే భారంగా మారుతున్నాయన్నది . వాదన . కొండ , మారుమూల ప్రాంతాల్లో డేటా సేవలు అందుబాటులో లేకున్నా వినియోగదారులు బలవంతంగా డేటా ప్లాన్లు కొనాల్సి వస్తోందనే ఆవేదన ఉంది . రెండు మొబైల్ కనెక్షన్లు ఉన్న వారు .. లోనూ డేటా కోసం చెల్లిస్తూ , డబ్బు వృథా చేసుకుంటున్నారని ఈ సంఘాలు తెలిపాయి . బ్యాంక్ ఖాతాలు , యూపీఐ లావాదేవీలపై ప్రభావం ఉండదు వాలెట్ నిష్క్రియా రుసుములపై ఫోన్పే వివరణ ఢిల్లీ : డిజిటల్ వాలెట్లు ఎలా పని చేస్తాయనే దానిపై కొంత మంది విని యోగదార్లకు పంపిన నోటిఫికేషన్లు గందరగోళానికి దారి తీయడంతో , ఫోన్పె వివరణ ఇచ్చింది . ఇన్యాక్టివ్ గా ఉన్న ఫోన్పే వాలెట్లపై విధించే నిష్క్రియా రుసు ములు వినియోగదార్ల అనుసంధానిత బ్యాంకు బాతాలు లేదా యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపమని పేర్కొంది . ప్రీపెయిడ్ చెల్లింపు సాధనమైన ( పీపీఐ ) ఫోనే వాలెట్కు మాత్రమే ఇవి వర్ణిస్తాయని తెలిపింది . ఫోన్పె వాతా , యూపీఐ తాతా ఫోన్పే వాలెట్ అన్నీ ఒకటేనని వినియోగదార్లలో ఉన్న సాధారణ ఆపోహ వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని తెలిపింది . వాస్త వానికి ఇవి స్వతంత్రంగా పని చేస్తాయని , వేర్వేరు నిబంధనలకు లోబడి ఉంటాయని వెల్లడించింది . వినియోగదార్ల వాలెట్ బ్యాలెన్స్ సరిపోనప్పుడు , వారి బ్యాంక్ ఖాతాల నుంచి నిష్క్రియా రుసుములను వసూలు చేయొచ్చా అనేది యూజర్లలో ఒక ప్రధాన ఆందోళనగా ఉందని పేర్కొంది . లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల నుంచి లేదా యూపీఐ ద్వారా ఎలాంటి మొత్తాలూ మినహాయించమని , అలాగే వాలెట్ బ్యాలెన్స్ నెగెటివ్ గా మారదని ఫోన్పే తెలిపింది . ఏఐని మరింత వాడేస్తాం • పాలన , కార్యకలాపాలపై కంపెనీల దృష్టి • నిపుణుల నియామకాలకూ సన్నద్ధత • క్వెస్ కార్ప్ నివేదిక ముంబయి : పాలనా వ్యవహారాలు , కార్యకలాపాల్లో కృత్రిమ మేధ ( ఏఐ ) వినియోగాన్ని పెంచాలని భారత కంపెనీలు కోరు కుంటున్నాయని ఓ నివేదిక తెలిపింది . ఏల నిపుణుల నియా మక ధోరణి ప్రయోగ దశ నుంచి అమలు దిశగా మళ్లుతోం దనే విషయాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది . కంపెనీలు తమ ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ సొల్యూషన్లను ఆమలు చేయగలిగే , నిర్వహించగలిగే , అనుసంధానించగలిగే నిపుణులను ఎక్కువగా కోరుకుంటున్నాయని పేర్కొంది . 1.5 లక్షల ఉద్యోగ ప్రకటనల ఆధారంగా క్వెస్కార్స్ ఈ నివేదికను రూపొందించింది . దీని ప్రకారం .. భారత్లో సుమారు 820,000 మంది ఏఐ వృత్తి నిపుణులు ఉన్నారు . వీరిలో 257,000 మంది కీలక ఏఐ బాధ్యతల్లో ఉండగా , 6,63,000 మంది ఏఐ ఎంబెడెడ్ రోల్సేను నిర్వహిస్తున్నారు . * ఉద్యోగ స్వరూపంలో వ్యత్యాసాలు ఉన్నట్లు కూడా నివేదిక గుర్తించింది . పునర్వినియోగ ఇంటర్నల్ ఏఐ ప్లాట్ఫామ్లు , ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ , గవర్నెన్స్ కోసం గ్లోబల్ కేవబిలిటీ సెంటర్లు ( జీసీసీలు ) నియామకాలు చేపడుతుండగా .. క్లయింట్ ప్రోగ్రామ్ ఏఐని వాడేందుకు ఐటీ సేవల సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి . * ఫైనాన్స్ , రిస్క్ , ఆపరేషన్స్ , కస్టమర్ ఎక్స్ పీరియన్స్ , ఉద్యోగుల సిస్టమ్లకు ఏఐని అనుసంధానించేందుకు సంస్థలు ఎంపిక ఆధా రంగా నియామకాలు చేపడుతున్నాయని నివేదిక తెలిపింది . + 35 లక్షల యాక్టివ్ ఉద్యోగ ప్రకటనల్లో సుమారు 6-68 % మేర గిరాకీ కోర్ ఏఐ రోల్సే ఉండగా .. 32-34 % వరకు డిమాండు ఏఐ - ఎంబెడెడ్ రోలకు ఉందని వెల్లడించింది . అయితే ఈ గిరాకీ నిష్పత్తి సప్లయ్ జేసు విరుద్ధంగా ఉందని , మొత్తం 8,2000 మంది ఉద్యోగులలో 72-71 శాతం మంది ఏఐ ఎంబెడెడ్ రోల్స్ ఉండగా .. కేవలం 26-28 శాతం మంది మాత్రమే కోర్ ఏట రోల్స్ పనిచేస్తున్నారని నివే తెలిపి ఏఐ వృద్దికి మూడు విభిన్న చోదకాలు ... ' ఏఐ వృద్ధికి మూడు విభిన్న చోదక శక్తులు అవతరించినట్లు మా అధ్యయనంలో తేలింది . బీసీసీలు పునర్వినియోగ ఏఐ ప్లాట్ ఫామ్ లు , గవర్నెన్స్ సామర్థ్యాలను నిర్మిస్తు న్నాయి . ఐటీ సర్వీసెస్ పెద్దయెత్తున ఏఐ విస్తరణను పారిశ్రామికీకరిస్తున్నాయి . ఇక సంస్థలు ఏలని నేరుగా వ్యాపార కార్యకలాపాల్లో , నిర్ణయ ప్రక్రియల కోసం వాడుతున్నాయి . ఇవన్నీ కలిసి ప్రయోగాల కంటే అమలు సామర్థ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఒక ఐటీ స్థాపింగ్ తెత నైపుణ్య వ్యవస్థ సృష్టిస్తున్నాయ ' ని క్వెసే కార్ప్ జోషి అన్నారు . ప్రస్తుతం భారత్లోని ఏఐ సిబ్బందిలో 70 శాతం మందికి పైగా సంప్రదాయ ఏఐ నిపుణుల పరిధి వర్తించని రోల్స్ ఉన్నారని తెలిపారు . అదే సమయంలో మొత్తం ఏఐ గిరాకీలో దాదాపు మూడింట ఒక వంతు ఆపరేషన్స్ , కస్టమర్ సర్వీస్ , మార్కెటింగ్ ఫైనాన్స్ గవర్నెన్స్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ లాంటి వ్యాపార విభాగాల నుంచి వస్తోందని ఆయన అన్నారు . ఎన్ఎస్ఈ ఐపీఓ .. ఇవీ తెలుసుకోవాల్సిందే ఢిల్లీ : నియంత్రణ మార్పులు , సాంకేతిక వైఫ ల్యాలు , సైబర్ దాడులు , ఏఐ సంబంధిత నష్టాలు , వీటికి తోడు డెరివేటివ్స్ ట్రేడింగ్ ఆదాయాలపై గణ నీయంగా ఆధారపడటం వంటివి తమ ఆర్ధిక పని తీరు , వ్యాపార కార్యకలాపాలను ప్రభావితం చేయొ చ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ( ఎన్ఎస్ఈ ) హెచ్చ రించింది . ఇటీవల దాఖలు చేసిన ఐపీఓ ముసాయిదా పత్రాల్లో ( డీఆర్ హెచ్పీ ) పలు విషయాలను ప్రస్తావిం చింది . 2025-28 ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వ హణ ఆదాయంలో లావాదేవీల రుసుముల వాటా 78.65 శాతంగా ఉందని పేర్కొంది . ఇందులో కేవలం ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచే మొత్తం నిర్వహణ ఆదా యంలో 60.22 శాతం లభించిందని తెలిపింది . * ఈక్విటీ డెరివేటివ్స్ ప్రేమ్వర్క్న బలోపేతం చేయ డానికి మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఇటీవల ప్రవేశ పెట్టిన నియంత్రణ చర్యలు .. క్యాష్ , డెరివేటివ్స్ విభాగాల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు మందగించడానికి ఇప్పటికే దారి తీశాయని , ఫలితంగా 2025-26లో ట్రేడింగ్ రాబడి తగ్గిందని ఎక్స్ఛేంజ్ పేర్కొంది . • ముసాయిదా పత్రాల్లో సమస్యలు వివరించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ • నియంత్రణ , సాంకేతికత , సైబర్ దాడులు , ఏవి సంబంధిత నష్టాలపై హెచ్చరిక • డెరివేటివ్స్ ట్రేడింగ్ ఆదాయాలపై ఆందోళన + నిబంధనలను మరింత కఠినతరం చేయడం , లావా * ట్రేడింగ్ యాక్సెస్ దేవీల పన్నులు పెంచడం , మదుపర్ల ప్రాధాన్యతల్లో మార్పులు , ప్రత్యామ్నాయ అసెట్ క్లాసెస్ వైపు వారు మళ్లడం వంటివి ట్రేడింగ్ పరిణామాలు , లాభదాయక తపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఎన్ఎస్ఈ హెచ్చరించింది . + సెబీ నిరంతర పర్యవేక్షణ , తనిఖీలు , అమలు చర్యలకు లోబడి ఉండటం వంటి విస్తృతమైన నియంత్రణపరమైన రిస్క్లను కూడా ఎక్స్చేంజ్ ఎత్తిచూపింది . కార్యకలా పాలు , పాలన , సాంకేతికత , నిబంధనల పాటింపునకు సంబంధించిన విషయాలపై సెబీ నుంచి తమకు షోకాజ్ నోటీసులు , హెచ్చరిక లేఖలు , లోపాల లేఖలు , సలహా కమ్యూనికేషన్లు అందినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది . పాయింట్ ( టీఏపీ ) ఆర్కిటె క్చర్ , నెట్ వర్క్ కనెక్టివిటీకి సంబంధించిన విచారణల విషయంలో 2021 అక్టోబరులో రూ . 613 కోట్లకు పైగా చెల్లించడంతో పాటు ఇటీవల తాము గణనీయమైన పరిష్కార ఖర్చులను భరించామని స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపింది . నియంత్రణ తనిఖీ ఫలితాలకు సంబంధించి ఒక పరిష్కార ఉత్తర్వు కింద 2025 జులైలో రూ .40.35 కోట్లు కూడా చెల్లించినట్లు పేర్కొంది . కో - లొకేషన్ , డార్క్ సైజర్ వ్యవహారాలకు సంబం ధించిన వాటితో పాటు న్యాయపరమైన , నియంత్రణప రమైన ప్రక్రియలు ఇంకా పరిష్కారం కాలేదని , వీటి వల్ల తమ ప్రతిష్ట , ఆర్థిక పరంగా ప్రభావాలు పడే అవ NSE కాశం ఉందని ఎన్ఎస్ఈ పేర్కొంది . ట్రేడింగ్ పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతున్నం దున .. టెక్నాలజీ వైఫల్యాలు , సైబర్ సెక్యూ రిటీ సంఘటలను కీలక కార్యాచరణపరమైన నష్టాలుగా ఎక్స్ఛేంజ్ గుర్తించింది . + 2001 ఫిబ్రవరిలో జరిగిన ఒక సంఘటనను ఎక్స్ఛేంజ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది . ఆ సంఘటనలో కీలకమైన నష్ట భయ నిర్వహణ , క్లియ రింగ్ , సెటిల్మెంట్ స్వలెన్స్ సిస్టమ్లపై సాంకేతిక సమస్యల ప్రభావం పడటంతో , అన్ని విభాగాల్లో 5 గంటలకు పైగా ట్రేడింగ్ నిలిచిపోయింది . కంపెనీలు ఏమంటున్నాయంటే ఆదునిక 4 జీ , 5 జీ నెట్వర్క్లు పూర్తిగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారితమైనవని టెలికాం సంస్థలు పేర్కొం టున్నాయి . ఇందులో వాయిస్ కాల్స్ అనేవి డేటా నెట్వ క్కపైనే , ఒక ఆప్లికేషన్లాగా పనిచేస్తాయని , అందువల్ల నెట్వర్క్ స్థాయిలో వాయిస్ను , డేటాను వేరు చేయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా పేర్కొంటు న్నాయి . అతి తక్కువ కాలపరిమితితో చౌక ప్లాన్లు ఇస్తే స్కామర్లు , మోసగాళ్లు సులభంగా నెట్వర్క్ కి ప్రవే శించి , స్పామ్ కాల్స్ పెరిగేందుకు అవకాశం ఉంటుందం టున్నాయి . ఇప్పుడు దేశమంతా డిజిటల్ వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో .. డేటా లేని ప్లాన్లను తీసుకొస్తే , సమాజంలో ఒక వర్గాన్ని డిజిటిల్ వ్యవస్థకు దూరం చేసినట్లే అవుతుందని పేర్కొంటున్నాయి . వినియోగదారు లకు డేటా లేని ప్లాన్లు ఇచ్చి , వాడినప్పుడే బిల్లు అనే విధానం తీసుకొస్తే .. గతంలో మాదిరే బారీ బిల్లులు వస్తాయనీ వివరిస్తున్నాయి . అందరికీ తక్కువ ధరలో మొబైల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి , డేటా ఆధారిత మౌలిక సదు పాయాలకు పెట్టుబడులు పెడుతూ- వాటిపై ఆర్జనను ఆశిస్తున్న టెలికాం కంపె ప్రయత్నాలు మధ్య అంతరం ఎలా భర్తీ అవుతుందన్న వేది చూడాల్సిన విషయం . ట్రాయ్ తన ఆదేశాలకే కట్టుబడి ఉంటుందా ? లేదా . ఏదైనా రాజీ మార్గం చూపిస్తుందా అని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి . ఈనాడు , హైదరాబాద్ హైదరాబాద్ సహా 5 నగరాల్లో 100 కు పైగా ఫుల్ఫీల్మెంట్ కేంద్రాలు ముంబయి : ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుండటంతో వినియోగ దార్లకు వేగవంతంగా ఉత్పత్తుల డెలివరీకి , మరిన్ని ఉత్పత్తుల ఎంపి కకు వీలు కల్పించేందుకు దేశంలోని అయిదు ప్రధాన నగరాల్లో 100 కు పైగా పులల్మెంట్ కేంద్రాలను ప్రారంభించినట్లు అమెజాన్ తెలి పింది . హైదరాబాద్ , ఢిల్లీ- ఎన్సీఆర్ , ముంబయి , చెన్నై , బెంగళూరులో ఏర్పాటు చేసింది . కాగా . కంపెనీకి కామర్స్ సేవల సంస్థ ఆమె జాన్ నా 1.00008 ఫుట్ amazon ఫిల్మెంట్ కేంద్రాలతో 100 నగరాలకు విస్తరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమ నార్హం . నిత్యావసర వస్తువులు , వ్యక్తిగత సంరక్షణ , ప్యాషన్ , సౌందర్య ఉత్పత్తులతో పాటు దుస్తులు , ఎలక్ట్రానిక్స్ , ఆభరణాలు , ఫర్నిచర్ వంటి అన్ని వస్తువుల విభాగాల్లో వినియోగదారులకు విస్తృతమైన ఎంపికను అందించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది . ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల విస్తరణతో అమెజాన్ నౌలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వేలాది నిత్యావసర వస్తువుల కంటే నాలుగు రెట్ల ఎక్కువ ఎంపికలను అందించేందుకు వీలవుతుందని పేర్కొంది . అమెజాన్ ప్రైమ్ డే విక్ర యాలు జులై 4 నుంచి 6 వ తేదీ వరకు జరగనున్నాయి . డిజిటల్ ఆవిష్కరణలకు రూ .9,400 కోట్ల పెట్టుబడులు : బ్లూక్లౌడ్ ఈనాడు , హైదరాబాద్ : డిజిటల్ మౌలిక సదుపాయాలు , సైబర్ భద్రత , కృత్రిమ మేధ ( ఏఐ ) ఆధారిత ఆవిష్కరణల కోసం 2030 నాటికి రూ .1,400 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తెలిపింది . ఏఐ సాంకేతికత ద్వారా వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్క రించడమే తమ ప్రధాన వ్యూహమని సంస్థ సీఈఓ చంద్రశేఖర్ ముద్రగణం పేర్కొన్నారు . భారత్లో సాధించిన డిజిటల్ అనుభవంతో ఆఫ్రికా లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లో తమ సేవలను విస్తరిస్తున్నా మని తెలిపారు . డేటా ఆధారిత ఆరోగ్య విశ్లేషణతో పాటు గుంటూరులో రూ .4000 కోట్లతో బయోబ్యాంక్ పర్యావరణ వ్యవ స్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పం దాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు . ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా కీలకమైన ఆరోగ్య సూచికలను అంచనా వేసే బ్లూడియో సన్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు . ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్లను ఆరికట్టేందుకు బయోస్టెర్ రూపొందించినట్లు , దీనిని ప్రముఖ ఆసు పత్రులు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు . తెలంగాణ పోలీసు శాఖ తోనూ పలు రక్షణ ప్రాజెక్టుల్లో సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంద న్నారు . ఒడిశాలో రూ .3,300 కోట్లతో 100 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు . * ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ .3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ముద్రగణం తెలిపారు . గత ఆర్థిక సంవత్స రంలో సంస్థ ఆదాయం 28 % వృద్ధితో రూ . 1,002 కోట్లుగా నమోదైంది . భారత విపణిలోకి నొవార్టిస్ ఫ్లూవిక్టో ఈనాడు , హైదరాబాద్ : ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే రెడియోలిగాండ్ థెరపీ ప్లూనిను నొవార్టిస్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది . దేశవ్యాప్తంగా ఏటా 2.5 లక్షల మంది ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఈ సందర్భంగా సంస్థ పేర్కొంది . ఆరోగ్యకరమైన కణా లకు హాని కలగకుండా , కచ్చితత్వంతో నేరుగా క్యాన్సన్ కణాలనే లక్ష్యంగా చేసుకొని ఈ ఔషధం పనిచేస్తుందని పేర్కొంది . తమకు భారత్ అత్యంత ప్రాధాన్య మార్కెట్ అని నోవార్టిస్ ఆసియా పసిఫిక్ రీజియన్ హెడ్ జుడిత్ లవ్ తెలిపారు . దేశ వ్యాప్తంగా ఉన్న 250 కి పైగా న్యూక్లియర్ మెడిసిన్ కేంద్రాలు , ఎంపిక చేసిన ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకొని రోగులకు ఈ అత్యాధునిక చికిత్సను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నొవార్టిస్ వెల్లడించింది . తయారీ , జీసీసీలకు గమ్యస్థానంగా భారత్ ! హ్యూస్టన్ : భారత్ చేపడుతున్న విధాన సంస్కరణలు , నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి , పోటీతత్వ ధరలు , పటిష్టమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు లాంటివి ఆధు నాతన తయారీ , గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ( జీసీసీ ) కోసం వారత్న ప్రాధాన్య గమ్య స్థానంగా నిలబెడుతున్నాయని హ్యూస్టన్లో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావే శంలో పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు . ' ఇండియా స్పాట్లెట్ : స్ట్రాటజిక్ ఇన్సైట్స్ పర్ ఆడ్వాన్స్డ్ మానుఫ్యాక్చరింగ్ అండ్ జీసీసీ ' పేరిట ఓ కార్య క్రమాన్ని భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించింది . ప్రపంచ తయారీ , ఆవిష్కర ణల కేంద్రంగా దేశ స్థానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో భారత్ కొనసాగిస్తున్న ఆర్థిక సంస్కరణలు , పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు , ప్రోత్సాహక కార్యకలా పాలపై ఈ సందర్భంగా హ్యూస్టన్లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి. మంజునాథ్ ప్రముఖంగా ప్రస్తావించారు . భారత జీసీసీల వ్యవస్థ సాధిస్తున్న వేగ వంతమైన వృద్ధిపై చర్చిస్తూ సాంకేతికత , ఇంజినీరింగ్ • ఆర్థిక సేవలు , ఆరోగ్య సంరక్షణ వరకు వివిధ రంగాల్లో ఏటా 100 కి • కొత్త కేంద్రాలు స్థాపి స్తున్నారని ఐసీఐసీఐ బ్యాంక్ , జేఎల్ఎఎల్ ఇండియా , అమెరికాకు చెందిన ఇంజినీ రింగ్ , టెక్నాలజీ సంస్థ కేబీఆర్ నిపుణులు పేర్కొన్నారు . ఈ క్రమంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి జీసీసీ గమ్యస్థానంగా ఆవిర్భవిస్తోందని తెలిపారు . - ShareChat