ఇకపై జనన, మరణాలను రెండేళ్లలోపు రిజిస్టర్ చేయకపోతే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు అనుమతి కావాలి. కాబట్టి అలసత్వం వద్దు. హాస్పిటల్ డిశ్ఛార్జ్ సమ్మరీ, పేరెంట్స్ IDతో బర్త్ సర్టిఫికెట్‌కు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తి ఆస్పత్రిలో చనిపోతే మెడికల్ రిపోర్టు, ఇంట్లో మరణిస్తే కుటుంబీకుల డిక్లరేషన్, ID ప్రూఫ్‌తో పంచాయతీ/మున్సిపాలిటీ/మీసేవలో డెత్ సర్టిఫికెట్‌కు అప్లై చేసుకోవచ్చు. TG: ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మండలాల్లో చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్ ద్వారా నమోదు చేసి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించనున్నారు. #ℹ️సమాచారం #😇My Status #📰ఈరోజు అప్‌డేట్స్ #📢తాజా అప్‌డేట్స్🎙️
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
10 likes
11 shares

More like this