
३३ ह व्ह्यू · १.८ ह प्रतिक्रिया | పీలేరు లో వలస కార్మికుల నమోదు తప్పనిసరి, 2–3 రోజుల్లో పోలీస్ స్టేషన్లో వివరాలు ఇవ్వాలని సీఐ యుగంధర్ ఆదేశం/Bs News Telugu/11-05-2026. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికుల వివరాలను తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని పీలేరు అర్బన్ సీఐ పి. యుగంధర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, హోటల్ మరియు లాడ్జ్ యజమానులు, ఇటుక బట్టీలు, గోదాములు, వ్యాపార సంస్థల నిర్వాహకులు తమ వద్ద పనిచేస్తున్న వలస కార్మికులను రెండు నుంచి మూడు రోజులలోగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. కార్మికుల పేరు, పూర్తి చిరునామా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఫోటోలు, అలాగే యజమాని మరియు కాంట్రాక్టర్ వివరాలను పోలీసు శాఖ నిర్దేశించిన ప్రొఫార్మాలో అందించాలని తెలిపారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కార్మికుల పేరుతో వచ్చి అనుమానాస్పద కార్యకలాప� | Shaik Babjan

