ShareChat
click to see wallet page
search
మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్‌కు 7 రోజుల జైలు శిక్ష మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి. ఈ తనిఖీలలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 5 మందిని గుర్తించి, గురువారం సెకండ్ క్లాస్ కోర్టు జడ్జి శ్రీ ఆర్.శశిధర్ గారి ఎదుట హాజరుపరచగా నలుగురు ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.1000/- జరిమానా విధించగా, ఎక్కువ మోతాదు మద్యం మత్తులో DCM వాహనం నడిపిన డ్రైవర్ కు గౌరవ న్యాయమూర్తి 7 రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా భారీ వాహన డ్రైవర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. #MahabubnagarPolice #📰 వార్తలు
📰 వార్తలు - adani ACG radan a0ap He మీఇంటిన మంది క Shot on OnePPlus 142/23126 17,24 Powered oyriple Camera adani ACG radan a0ap He మీఇంటిన మంది క Shot on OnePPlus 142/23126 17,24 Powered oyriple Camera - ShareChat