ShareChat
click to see wallet page
search
👉*వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు* 👉*ప్రజలపక్షణ ఎంతవరకు అయినా పోరాటం చేస్తాము : మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయ ప్రసాద్* *మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు*.. *మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం రామకృష్టాపురం HPCL పెట్రోల్ బంక్ వద్ద నుండి కోరమాండల్ గేట్ వరకు నిరసన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు* *👉ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో మరియు DSC అక్రమాలు పేపర్లు దగ్దం చేశారు* . నియోజకవర్గంలో పార్టీ పరిశీలకులు జహీర్ అహ్మద్ గారు హాజరయ్యారు *మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయప్రసాద్ గారు మాట్లాడుతూ ..చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం. ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది అని ఆయన తెలియజేశారు*. *యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమం, రైతులకు భరోసా, పేదలకు అభివృద్ధి అనే పేరుతో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎంతవరకు అమలయ్యాయో ప్రజలే పరిశీలించాలి. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత. ప్రజల తరఫున నిలబడి వారి గొంతుకగా పనిచేయడం మా కర్తవ్యం. మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. అని వారు తెలియజేశారు*. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు, వార్డ్ పార్టీ పరీక్షలకు, రాష్ట్ర ,జిల్లా నియోజకవర్గస్థాయి నాయకులు వార్డ్ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా కార్యకర్తలు, యూత్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్లు పశ్చిమ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయం #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - ShareChat
00:29