#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #trs#kcr#ktr#harish rao#trs సైన్యం తెలంగాణ# భద్రాచలానికి పోలవరం జలగండం.. ఆ ప్రాజెక్టు నిండితే, 13.15 నుంచి 17.72 మీటర్ల నీటి ముంపులో భద్రాచలం ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, చుట్టుపకల ప్రాంతాలకు పొంచి ఉన్న బ్యాక్వాటర్ ముప్పు పై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. ప్రస్తు త ప్రభుత్వం ముంపు బాధితుల సమస్యలను పట్టించుకోకపోతే తాము బాధితులకు అండగా ఉంటామని స్పష్టంచేసింది.
2022నాటి బ్యాక్వాటర్తో భద్రాచలం, బూర్గంపహాడ్, సారపాక అతలాకుతలం
ఆ ప్రాంతంలోని పరిశ్రమలకూ ముప్పే
2,000 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, పూర్తిస్థాయి శాశ్వత పునరావాసం కల్పించాలి
లేనిపక్షంలో బాధితుల పక్షాన పోరాటం చేస్తాం
పీపీఏ సీఈవోకు హరీశ్రావు లేఖ
అందజేసిన భద్రాచలం, పినపాక బీఆర్ఎస్ నేతలు
పోలవరం పూర్తయితే తెలంగాణ ఎదురోబోయే భయానక పరిస్థితులను హరీశ్రావు ఈ లేఖలో గణాంకాలు సహా వివరించారు. ‘పోలవరం పూర్తిస్థాయి నీటిమ ట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా సరి గ్గా 45.72 మీటర్లే. దీనర్థం ప్రాజెక్టు నిండితే, భద్రాచలం ఎప్పుడూ ముంపు ప్రమాదంలోనే ఉంటుంది. భద్రాచలం వద్ద గోదావరి నది లో తైన బెడ్ లెవల్ 26 మీటర్లు. బ్యాక్వాటర్ ప్రభావం వల్ల భద్రాచలంలో ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటుంది. ఇది నిత్యం ఒక జలగండంలా మా రబోతున్నద’ని హరీశ్రావు హెచ్చరించారు


