ShareChat
click to see wallet page
search
#🟡తెలుగుదేశం పార్టీ ఆంధ్రజ్యోతి పై దాడి అమానుషం...* వేముల వెంకట కృష్ణ, మైలవరం నియోజకవర్గం బిసి సెల్ ప్రధాన కార్యదర్శి. కొండపల్లి :హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు కలిసి చేసిన దాడిని వేముల వెంకట కృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి గూండాగిరీ చర్యలకు ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పత్రిక ప్రకటనను విడుదల చేస్తూ హైదరాబాదులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే స్వయంగా రౌడీ మూకలను వెంట తీసుకెళ్లి దాడులకు దిగడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారు గత ఐదేళ్లుగా ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ధైర్యంగా నిలబడి ప్రజలకు నిజాలను తెలియజేస్తున్నారని ప్రశంసించారు. అమరావతి అంశంపై వైసీపీ చేస్తున్న చర్యలను ఆధారాలతో ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక దాడులకు దిగడం వారి పిరికిపంద వైఖరికి నిదర్శనం అని విమర్శించారు. “మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి గానీ, దాడులు చేయడం సరైంది కాదు. నిజాయితీ ఉంటే వాస్తవాలతో ప్రజల ముందుకు రావాలి” అని అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జరిపిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నిజాలను ఎప్పటికీ అణచివేయలేరని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వేముల వెంకట కృష్ణ పిలుపునిచ్చారు.
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat