*ఈదమ్మ జాతరలో ఎలుకగూడెం సర్పంచ్ బందెయ్య రజకపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ➖ గోపి రజక*
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
*రాంరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్*
*ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక దాడికి కుట్ర*
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్య రజకపై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈదమ్మ దేవత జాతర సందర్భంగా జరిగిన ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన కొంతమందితో పాటు మాజీ సర్పంచ్ రాంరెడ్డి చాకులు, రాళ్లతో దాడి చేసినట్లు అందిన సమాచారం.
గాయపడిన సర్పంచ్ బందెయ్యను షాద్నగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక స్పందిస్తూ ప్రజలతో మమేకమై సేవలు చేస్తున్న ప్రజాప్రతినిధిపై ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని వారన్నారు.మాజీ సర్పంచ్ రాంరెడ్డి తోపాటు కొంత మంది నిందితులపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా బందెయ్యపై దాడులు జరిగినట్లు గుర్తు చేశారు.
జాతర ఏర్పాట్లను స్వయంగా చూసుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సమయంలో ఈ దాడి జరగడం బాధాకరమని ఆయన తెలిపారు. గతంలో కుమ్మెర గ్రామ రజకులపై దాడి, ఆసిఫాబాద్ పట్టణంలో రజక స్త్రీపై చెప్పులతో దాడి, తాండూరు రజకుల భూ కబ్జా ఘటన ఇలా రజకులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినతరమైన చట్టంను తీసుకురావాలని గోపి రజక ప్రభుత్వాన్ని కోరారు. #🏛️రాజకీయాలు


