😱 ప్రపంచంలోనే అత్యంత అరుదైన శివాలయం! పడుకున్న స్థితిలో పరమశివుడు! 🙏✨
సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా పరమశివుడు మనకు లింగ రూపంలోనో లేదా నటరాజ స్వామిగానో దర్శనమిస్తాడు. కానీ, విష్ణుమూర్తి లాగా పరమశివుడు కూడా పడుకున్న #🎶భక్తి పాటలు🔱 ##PallikondeshwaraSwami #SleepingShiva భంగిమలో దర్శనమిచ్చే ఏకైక అద్భుత క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? 👇
🔱 ఆలయ విశేషాలు:
పల్లికొండేశ్వర స్వామి: సాక్షాత్తు జగన్మాత పార్వతీ దేవి ఒడిలో తలపెట్టుకొని విశ్రమిస్తున్న భోగసయన శివుడి రూపం ఇక్కడ మాత్రమే చూడగలం.
సురుటుపల్లి కథ: క్షీరసాగర మదనం సమయంలో పుట్టిన హాలాహలాన్ని (విషాన్ని) మింగిన తర్వాత, ఆ విష ప్రభావం వల్ల కలిగిన మైకం, అలసట తీర్చుకోవడానికి శివుడు విశ్రాంతి తీసుకున్న పవిత్ర ప్రాంతమే ఈ 'సురుటుపల్లి'. (తమిళంలో సురట్ట అంటే మైకం, పల్లి అంటే విశ్రాంతి స్థలం). here అమ్మవారిని 'మరకతాంబిక' లేదా 'సర్వమంగళాదేవి' అని పిలుస్తారు.
ప్రదోష పూజల పుట్టినిల్లు: విష ప్రభావం నుండి కోలుకున్న శివుడు ఒక కార్తీక త్రయోదశి ప్రదోష సమయంలో దేవతల సమక్షంలో ఆనంద తాండవం చేశాడు. అందుకే ఇది ప్రధాన ప్రదోష క్షేత్రం. శనివారం వచ్చే 'శని ప్రదోషం' నాడు ఇక్కడ పూజలు చేస్తే శని దోషాలన్నీ పటాపంచలు అవుతాయి.
దంపతుల పరిహార క్షేత్రం: సాధారణంగా నవగ్రహాలు విడిగా ఉంటాయి. కానీ ఇక్కడ నవగ్రహాలు, వినాయకుడు, దత్తాత్రేయుడు, సూర్యభగవానుడు... ఇలా ప్రతి ఒక్క దేవతామూర్తి తమ భార్యలతో కలిసి దంపతుల సమేతంగా దర్శనమిస్తారు! భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగడానికి ఇదొక గొప్ప పరిహార క్షేత్రం.
రామాయణ ప్రాశస్త్యం: వాల్మీకి మహర్షి ఇక్కడే ఘోర తపస్సు చేసి 'వాల్మీకేశ్వర లింగాన్ని' ప్రతిష్టించారు. ఇక్కడే లవకుశులు పెరిగారని, శ్రీరాముడు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించాడని స్థల పురాణం చెబుతోంది.
📍 ఆలయం ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు సరిహద్దుల్లో, తిరుపతి జిల్లాలోని నాగులాపురం మండలానికి దగ్గరగా ఈ 'సురుటుపల్లి' క ఉంది.
✨ జగన్మాత ఒడిలో విశ్రమిస్తున్న ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ...
కామెంట్ బాక్స్లో "ఓం నమః శివాయ" అని టైప్ చేయండి! 👇


