ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా… వైద్య సహాయానికి ముందుకొచ్చిన ఎమ్మెల్యే జారె
19.04.2026 - ఆదివారం
దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామానికి చెందిన దొడ్డాకుల గిరిబాబు గారు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు వెంటనే స్పందించారు.
సర్జరీ కోసం అవసరమైన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా ఎల్ఓసి రూపంలో మంజూరు చేయించి, ఆసుపత్రికి వెళ్లి గిరిబాబు గారిని పరామర్శించి స్వయంగా చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి ఈ సహాయం పట్ల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్


