ఒడిశాకు చెందిన అగ్రికల్చరల్ సైంటిస్ట్ శుభశ్రీ, కర్ణాటకకు చెందిన ప్రదీప్ తమ వివాహాన్ని 'దివ్య వివాహం' పేరుతో సమాజానికి ఉపయోగపడేలా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో ఎక్కడా బ్యాండ్ మేళాలు, బాణసంచా సందడి కనిపించలేదు. దానికి బదులుగా.. మొదటి రోజు తలసేమియా రోగుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్, రెండో రోజు అనాథ పిల్లలకు వస్త్రదానం, మూడో రోజు పర్యావరణంపై అవగాహన కల్పించేలా మొక్కలు నాటారు.
ప్రకృతి ప్రేమికులైన ఈ జంట తమ పెళ్లిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడమే కాకుండా, చివరకు తమకు వచ్చిన బహుమతులను కూడా అనాథాశ్రమాలకు విరాళంగా ఇచ్చి, "సంతోషం అంటే ఖర్చులో కాదు.. సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉంది" అని నిరూపించారు. సామాజిక బాధ్యతతో కూడిన వీరి వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
#TALRadioTelugu #GoodNews #OdishaWedding #SimpleWedding #SocialResponsibility #SubhashreePradeep #Inspiration #touchalife #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status


