ShareChat
click to see wallet page
search
*దిల్లీలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి* ఇంటర్నెట్‌డెస్క్‌: దేశరాజధాని దిల్లీ (Delhi)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ పేలడంతో ఓ నివాససముదాయంలో మంటలు చెరలేగాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. షాదార్‌లోని వివేక్‌ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది భవనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 14 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో మరింతమంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 10 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.#news #sharechat
news - ShareChat