నేను దేవుణ్ణి నమ్మాను. నా పని అయిపోయింది. నా పిల్లలు ఎలా జీవించినా అది వాళ్ల ఇష్టం. అని అంటూ ఉంటారు చాలామంది కానీ బైబిల్ అలా చెప్పదు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, ఆయన దృష్టి ఆ ఒక్క వ్యక్తి మీద మాత్రమే ఉండదు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే తరాల మీద కూడా ఉంటుంది. అందుకే యెహోషువ, ‘నేను మాత్రమే యెహోవాను సేవిస్తాను. నా ఇంటివారు ఎలా ఉన్నా అది వాళ్ల ఇష్టం’ అని అనలేదు. ‘నేను నా ఇంటివారమును యెహోవాను సేవించెదము’ (యెహోషువ 24:15) అని ధైర్యంగా ప్రకటించాడు. దీని అర్థం పిల్లలను బలవంతం చేయమని కాదు. వాళ్లను దేవుని దగ్గరకు నడిపించే జీవితం మనం జీవించాలని. మన జీవితమే వారికి సాక్ష్యంగా ఉండాలని.
వాళ్ల కోసం ప్రార్థించాలని. వాక్యాన్ని నేర్పించాలని. ప్రేమతో సరిదిద్దాలని, హెచ్చరించాలని.
ఎందుకంటే…
నీ విశ్వాసం నీ దగ్గరితో ముగిస్తే అది ఒక వ్యక్తి కథ.
నీ విశ్వాసం నీ పిల్లలకు చేరితే అది ఒక తరం కథ.
నీ పిల్లల ద్వారా వారి పిల్లలకు చేరితే అది దేవుని రాజ్యం తరతరాలకు విస్తరించిన చరిత్ర అవుతుంది.” ❤️🙌🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #yesayya divenalu #....💕ప్రభువైన యేసుతో నా పయనం 💕.... #✊యౌవ్వనుడా జీవించు యేసు కోసం✊ #🙇♂️అనుదిన వాక్యము🙇♂️


