భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ (Bank of Hindostan).
దీనిని 1770 లో అప్పటి కలకత్తా (ప్రస్తుత కోల్కతా) లో స్థాపించారు.
భారతదేశంలో కాగితపు కరెన్సీ (Paper Currency) ని ముద్రించి, జారీ చేసిన తొలి బ్యాంకులలో ఇది ఒకటి.
భారతదేశంలో యూరోపియన్ బ్యాంకింగ్ పద్ధతుల (European Banking System) ఆధారంగా నడిచిన మొదటి బ్యాంకు కూడా ఇదే.
అలెగ్జాండర్ & కో అనే ఏజెన్సీ హౌస్ తమ సొంత వ్యాపార అవసరాలు మరియు ఈస్టిండియా కంపెనీ అధికారుల ఆర్థిక లావాదేవీల కోసం ఈ బ్యాంకును ప్రారంభించింది.
1830లలో వచ్చిన తీవ్రమైన వాణిజ్య సంక్షోభం (Commercial Crisis) వల్ల మాతృ సంస్థ అయిన అలెగ్జాండర్ & కో దివాళా తీయడంతో 1832లో ఈ బ్యాంకు పూర్తిగా మూతపడింది.
#🏆పోటీ పరీక్షల స్పెషల్ #🧠క్విజ్🌟 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #👩🎓GK & కరెంట్ అఫైర్స్ #😮హిస్టరీ అండ్ ఫాక్ట్స్👩🏫
00:15

