ShareChat
click to see wallet page
search
*దిశాకమిటీ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే జారె* 08.04.2026 – బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, జిల్లా దిశా కమిటీ అధ్యక్షులు రామసహాయం రఘురాం రెడ్డి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పాల్గొని అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను స్పష్టంగా అధికారుల ముందుంచారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు చేరేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, గృహనిర్మాణం, విద్య మరియు వైద్య సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. పోడు భూముల సమస్యలు, విద్యుత్ లోపాలు, ఆరోగ్య సేవల లోపాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజల ఇబ్బందులు తొందరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. “ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకం పారదర్శకంగా, వేగంగా అమలు కావాలి” అనే దృఢసంకల్పంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
🏛️రాజకీయాలు - భలరికతూడిం Sr Jaro Aadinarayan  భలరికతూడిం Sr Jaro Aadinarayan - ShareChat