#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party 🚨 దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ ఉరి 🆘
🏞️ కృష్ణాను ఏపీకి ధారాదత్తం చేస్తున్న రేవంత్ సర్కార్ 📣
📢 బనకచర్లకు ఒప్పుకొంటే పాలమూరు-రంగారెడ్డికి చంద్రబాబు ఎన్వోసీ ఇస్తాడని కేంద్రం ప్రతిపాదన
⚠️ రూ.80వేల కోట్ల ప్రాజెక్టు కోసం ఢిల్లీ కేంద్రంగా బాబు కీలుబొమ్మలాట
⛔ ఒప్పందానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ తుదిదశకు చేరుకున్న తరుణంలో డేంజర్గేమ్
🌊 తెలంగాణకు చుక్కనీరు దక్కకుండా జూరాల, శ్రీశైలం ఎగువన కుట్రలు
📢 ఇదే జరిగితే పాలమూరు ప్రాజెక్టులన్నీ పడావు.. దక్షిణ తెలంగాణ ఎడారి
♦️ పాదయాత్రకు బీఆర్ఎస్ సిద్ధమవడంతో ఉన్నపళంగా రేవంత్ డైవర్షన్ టూర్
పాలమూరుకు ప్రాణాధారమైన జూరాలను, దక్షిణ తెలంగాణకు జలభాండమైన శ్రీశైలాన్ని ఒక్కదెబ్బతో బలిపెట్టే పన్నాగమిది! చిక్కుముడులతో తెలంగాణను శాశ్వత దుర్భిక్షంలోకి నెట్టే దుర్నీతి ఇది. కేంద్రంలోని బీజేపీ సర్కార్, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలోని టీడీపీ సర్కార్.. మూడూ కలిసి కృష్ణాను చెరపట్టేందుకు, తెలంగాణకు ఉరి బిగించేందుకు సిద్ధమయ్యాయి. అందుకు తాడు పేనుతున్నది రేవంత్ సర్కార్. స్వయంగా కృష్ణాను ఏపీకి ధారాదత్తం చేస్తూ సొంత జిల్లాను బలిపెడ్తున్నది.. తాను పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రే!
ఇటు జూరాలకు ఎగువన భీమాపై కర్ణాటక మూడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. కృష్ణాపై కొల్పూర్ వద్ద ప్రాజెక్టుతోపాటు ఆల్మట్టి డ్యామ్ సామర్థ్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. అటు శ్రీశైలం రిజర్వాయర్కు ప్రధాన ఆధారమైన తుంగభద్ర మీద కూడా కర్ణాటక మూడు కొత్త ప్రాజెక్టులకు ముగ్గుపోస్తున్నది. మంత్రాలయం వద్ద ఏపీ-కర్ణాటక ఉమ్మడిగా ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నాయి. ఇది శ్రీశైలానికి రాకముందే నీటిని దొబ్బుకుపోయే కుట్ర! ఎవరికివారు బొక్కెనలేసి కృష్ణా, తుంగభద్ర జలాలను ఎగువనుంచే ఎత్తుకుపోయే పన్నాగం! తడిబట్టతో పాలమూరు గొంతుకోసి, తెలంగాణనోట్లో మట్టిగొట్టే.. కుతంత్రం!


