*#గెట్ పుత్తూరు వాసులకు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ,మినీ అండర్ బ్రిడ్జ్ నిర్మించండి: దక్షిణ రైల్వే జీఎంకు ఆర్.కె. రోజా విజ్ఞప్తి*#
పుత్తూరు పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) మరియు ర్యాంప్ సౌకర్యాన్ని,
అలాగే చిన్న అండర్ బ్రిడ్జి టైపులో
టూ వీలర్స్ ,ఆటోలు వెళ్లే విధంగా మినీ అండర్ బ్రిడ్జ్ కల్పించాలని కోరుతూ పర్యాటక, సంస్కృతి మరియు యువజన అభివృద్ధి శాఖ మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్కు లేఖ రాశారు.
సమస్య నేపథ్యం:
పుత్తూరు యార్డులోని రేణిగుంట చివర (కి.మీ 111/800-900 వద్ద) గతంలో లెవెల్ క్రాసింగ్ ఉండేదని, అయితే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం తర్వాత పాత మార్గాలను మూసివేసి, ప్రహరీ గోడను నిర్మిస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు కిలోమీటర్ల మేర మళ్లింపు మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలోని ప్రధానాంశాలు:
ప్రజల ఇబ్బందులు: రైల్వే ట్రాక్కు తూర్పు వైపున 11 వార్డుల్లో సుమారు 30,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా తమ నిత్య అవసరాల కోసం పశ్చిమ వైపు ఉన్న ఆసుపత్రులు, మార్కెట్లు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థుల అవస్థలు: ఈ ప్రాంతంలో 6 పాఠశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు లా కళాశాలలు ఉన్నాయి. సరైన దారి లేక విద్యార్థులు ప్రమాదకర రీతిలో ట్రాక్లు దాటాల్సి వస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలు & దేవాలయాలు: మున్సిపల్ కార్యాలయం, పశువైద్యశాల, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలతో పాటు ప్రసిద్ధ ద్రవపతి సమేత ధర్మరాజుల ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ బ్రిడ్జి ఎంతో అవసరం.
డిమాండ్:
చెన్నై ఎగ్మోర్ మరియు పెరంబూర్ క్యారేజ్ వర్క్స్ స్టేషన్లలో ఉన్న విధంగానే, పుత్తూరులో కూడా ర్యాంప్ సౌకర్యంతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని రోజా గారు కోరారు. తద్వారా వేలాది మంది ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. #RK ROJA AKKA #🇱🇸వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
#RKRoja


