అమానుషం..!
హృదయవిదారకం!
ఒక సామాన్యుడు తన హక్కు కోసం అస్థిపంజరాన్ని పట్టుకుని బ్యాంకు గడప తొక్కాల్సి వచ్చిందంటే వ్యవస్థలు ఎంతలా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు…!!
ఒడిశాలో దారుణం: కదిలించే కన్నీటి గాథ!** 💔
నియమ నిబంధనల పేరుతో సామాన్యులను వేధించే బ్యాంకింగ్ వ్యవస్థకు ఇదో మాయని మచ్చ..!చనిపోయిన తన సోదరి అకౌంట్లో ఉన్న డబ్బుల కోసం ఒక అన్న చేసిన పోరాటం చూస్తుంటే ఒళ్ళు గగుర్పుపొడుస్తోంది…!
ఏం జరిగింది?
ఒడిశాలోని కియోంజర్ జిల్లా మాలిపోసి బ్యాంక్ వద్ద ఈ అమానుషం చోటుచేసుకుంది. ‘’ జీతు ముండా’’అనే వ్యక్తి తన సోదరి అకౌంట్లోని డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు రోజుల తరబడి బ్యాంక్ చుట్టూ తిరిగాడు….
"నా చెల్లి చనిపోయింది, ఆ డబ్బులు మాకు అవసరం" అని మొత్తుకున్నా బ్యాంక్ అధికారులు కనికరించలేదు.
"సంతకం పెట్టడానికి అకౌంట్ హోల్డర్ రావాల్సిందే" అంటూ నిబంధనల పేరుతో వేధించారు.
ఆమె చనిపోయిందని చెప్పినా వినకుండా, ఆమెను తీసుకురావాలని పట్టుబట్టారు.
అస్థిపంజరంతో బ్యాంకుకు…!
అధికారుల నిర్లక్ష్యానికి, మొండితనానికి విసిగిపోయిన ఆ అన్న.. కన్నప్రేమను, బాధను దిగమింగుకుని ఒక సాహసోపేతమైన, ఆవేదనతో కూడిన నిర్ణయం తీసుకున్నాడు. తన సోదరిని పూడ్చిపెట్టిన చోట తవ్వి, ఆమె ‘’అస్థిపంజరాన్ని’’ నేరుగా బ్యాంకుకే తీసుకువచ్చాడు..!
"చనిపోయిన మనిషిని తీసుకురమ్మన్నారు కదా.. ఇదిగో నా చెల్లి!" అంటూ ఆ అస్థిపంజరాన్ని చూపించి తన నిరసనను వ్యక్తం చేశాడు.
**ప్రశ్నిద్దాం..**
నిరక్షరాస్యుల పట్ల, పేదల పట్ల అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం…!
నిబంధనలు మనుషుల కోసమా లేక మనుషులే నిబంధనల కోసమా..!!?
మానవత్వం మంటగలిసిపోతున్న ఈ వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుంది….!? #🎭 శ్రీదేవి డ్రామా కంపెనీ #👉 Tuesday Thoughts #💕గుప్పెడంత మనసు😍 #😍సీరియల్ భామలు💃 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼


