ఓడిషాలోని సుందర్ఘర్ జిల్లాకు చెందిన శాంతిలత సాహు.. ఒక సాధారణ గృహిణి స్థాయి నుండి ఆ జిల్లాలోనే తొలి లైసెన్స్డ్ మహిళా డ్రోన్ పైలట్గా ఎదిగి సరికొత్త చరిత్ర సృష్టించారు.
'నమో డ్రోన్ దీదీ' పథకంలో భాగంగా శిక్షణ పొందిన ఈమె, తన ఆటో రిక్షాలో డ్రోన్ను తీసుకెళ్తూ పొలాల్లో ఎరువులు, పురుగుమందులు చల్లుతూ హైటెక్ వ్యవసాయ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. ఎకరాకు కేవలం ₹250 చార్జీ వసూలు చేస్తూ, ఇప్పటివరకు సుమారు 150 ఎకరాలకు పైగా సాగు భూమిలో డ్రోన్ ఆపరేషన్లు పూర్తి చేసి రైతులకు ఖర్చు, శ్రమ తగ్గించడమే కాకుండా, తనలాంటి ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
#TALRadioTelugu #GoodNews #OdishaNews #agriculture #DroneFarming #womenempoweringwomen #touchalife #😇My Status #🙆 Feel Good Status #💪పాజిటీవ్ స్టోరీస్


