Mohan
34K views 3 months ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #BRS party ఓరుగల్లులో నేడే రైతు సంగ్రామం ✊🏻 రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ సదస్సు 💥 🎯 కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైన రైతులు. దండుకట్టి తరలివచ్చేందుకు ఏర్పాట్లు 📣 హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ⚠️ 2022, మే 6న వరంగల్‌ వేదికగా రైతు డిక్లరేషన్‌ ప్రకటించిన కాంగ్రెస్‌, గద్దెనెక్కి మొండిచెయ్యి చూపిన వైనం 👨🏻‍🌾 రేవంత్‌ సర్కార్‌పై రగులుతున్న కర్షకులు రైతు డిక్లరేషన్‌ పేరిట నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్‌ వైఖరిని ఎండగట్టేందుకు కర్షకలోకం సిద్ధమైంది. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో దర్జాగా బతికి.. కాంగ్రెస్‌ గద్దెనెక్కిన తర్వాత ఎవుసం ఆగమై కన్నీళ్లు పెడుతున్న రైతులకు అండగా ఓరుగల్లులో బుధవారం బీఆర్‌ఎస్‌ ‘రైతు సంగ్రామ సదస్సు’ నిర్వహించనున్నది. 2022, మే 6న వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, అప్పటి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించి నేటికి నాలుగేండ్లు పూర్తయినా.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా.. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంపై రాష్ట్ర రైతాంగం రగిలిపోతున్నది. అదునుకు యూరియా అందించకపోవడం, రైతు భరోసా వేయకపోవడమే కాకుండా పండించిన పంటను కూడా కొనకుండా మొండికేస్తున్న రేవంత్‌ సర్కార్‌పై అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సంగ్రామ సదస్సుతో బీఆర్‌ఎస్‌ భరోసా కల్పించనున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో దగాపడ్డ రైతుల తరఫున ‘ఏదీ నీ రైతు డిక్లరేషన్‌?’ అని సర్కార్‌ను నిగ్గదీసి అడుగనున్నది.
331 likes
5 comments 370 shares

More like this