Mohan
6K views 1 months ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #trs#kcr#ktr#harish rao#trs సైన్యం తెలంగాణ# మూడు రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగిందంటున్నవ్ కదా.. ఏం ఒప్పందం జరిగింది? నాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి 50 వేల ఎకరాలకు నీళ్లు వచ్చేలా చేశారు. మరి నిన్నటి మీటింగ్‌లో ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం రావాల్సిన 15.9 టీఎంసీల గురించి కేంద్రమంత్రితో ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నావా రేవంత్? తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా 2 టీఎంసీల కురుడి ప్రాజెక్టు , చిక్కలపర్వి బ్రిడ్జ్ కం బ్యారేజ్ 2.5 టీఎంసీలు, చుక్కల మంచి బ్రిడ్జ్ కం బ్యారేజ్ 5 టీఎంసీలు మొత్తం 7.5 టీఎంసీల సామర్థ్యంతో రెండు బ్యారేజీలు కడుతోంది. కర్ణాటక కడుతున్న ఈ మూడు అక్రమ ప్రాజెక్టుల పనులు ప్రారంభమై ఏడాది దాటి, ఇప్పటికే కురిడి ప్రాజెక్టు సగానికి పైగా పూర్తయినా.. రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి గానీ, కృష్ణా బోర్డుకు గానీ ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా మౌనంగా ఉంటూ కర్ణాటకతో కుమ్మక్కు అయ్యింది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
86 likes
47 shares

More like this