ShareChat
click to see wallet page
search
ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రారంభోపన్యాసం చేశారు. అందుకు సంబంధించిన ముఖ్యాంశాలు: •2014లో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభించినప్పుడు అధికారం, పదవులు అనే ఆలోచన లేదు. దేశానికి ఏం చేయాలి.. దేశ సమైక్యతను, సమగ్రతను ఎలా కాపాడాలి అనే ఆలోచనతోనే జనసేన ప్రస్థానం మొదలయ్యింది. •పార్టీ సిద్ధాంతాలు, భావజాలం బలపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ కోసం పని చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇది జనసేన భావ జాలం బలంగా ముందుకి వెళ్తుందనడానికి సంకేతం. •జనసేన పార్టీ ఎల్లప్పుడూ దేశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. •తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన పార్టీ వ్యతిరేకించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరునే తప్పుబడుతూ వచ్చాం. విభజన చేసిన తీరులో లోపాల కారణంగా ఈనాటికీ ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉన్నాయి. •ఢిల్లీలోనే సమావేశం పెట్టడానికి కారణం ఢిల్లీ చరిత్ర గొప్పదనం. ఈ నేల త్యాగాలకు ప్రతీక, పాలనకు ప్రతిరూపం. రాజ్యాంగ విలువలకు ప్రతిబింబం. ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం. ఇలాంటి గొప్ప నేలలో దేశ సమగ్రత కోసం పెట్టిన సమావేశం ద్వారా జనసేన పార్టీ దేశ భక్తికి ఎంత విలువ ఇస్తుందన్నది చెప్పాలన్నదే ఉద్దేశం. •చలి చీమలు కూడా పాముని చంపేస్తాయన్నట్టు- చెడు అయినా మంచి అయినా దేశానికి, జాతి సమగ్రతకు ద్రోహం చేసే ఎవరిని అయినా జనసేన వ్యతిరేకిస్తుంది. విభజన వాదాన్ని ప్రోత్సహించే వారిని జనసేన పార్టీ ఉపేక్షించదు. అలాంటి వారిపై జనసేన గళం బలంగా ఉంటుంది. •ఢిల్లీకి జనసేన పార్టీ ఎప్పుడూ అధికారం కోసం, పదవుల కోసం, ప్రాపకాల కోసం ఉపయోగించుకోదు. దేశ భక్తి, దేశ సమగ్రత, సమైక్యత కోసం మాత్రమే దేశ రాజధాని బాట పడతాం. • ⁠పార్టీ ఎంపీలు కూడా దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సమస్యల మీద మాట్లాడాలి అని అన్నారు. #JanaSenaniInNewDelhi #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
🟥జనసేన - @ 23 @ 23 - ShareChat