ShareChat
click to see wallet page
search
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #👨రేవంత్ రెడ్డి #Revanth reddy #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు #TDP ✌️ Chandrababu Naidu #news
👨రేవంత్ రెడ్డి - GANO 17 కల ప్రజల గళం ... 18 19 20 మూడు తరాల నీటి సమస్య పరిష్కారానికి ( మొదటి పేజీ తరువాయి ) ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు . గురువారం కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్ వద్ద 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు . ఇందులో కర్నాటక సీఎం డీకే శివకుమార్ , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కూడా పాల్గొన్నారు . గేట్లు ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు . రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ( ఆర్డీఎస్ ) కు కేటాయించిన 15.9 టీఎంసీల నీటిలో ఐదారు టీఎంసీలకు మించి తెలంగాణ వాడుకోలేకపోతున్నదని , మిగిలిన నీళ్లు రావడం లేదని ఆయన అన్నారు . తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావొచ్చు , నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావొచ్చు .. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం తీసుకువచ్చే దిశగా సాగుతున్న ఈ సమావేశం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు . రాజకీయాలకు అతీతంగా శాశ్వత పరిష్కారం కోసం సమిష్టి సహకారం అవసరమని ఆయన సూచించారు . మూడు తరాలుగా వివాదం కంటిన్యూ తుంగభద్ర డ్యామ్కు సంబంధించిన 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం కేవలం ఒక సాంకేతిక పనికాదు , మూడు తరాలుగా సాగుతున్న రైతాంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే ప్రక్రియకు నాంది అని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు . లక్షలాది మంది రైతుల జీవితాలతో ముడిపడిన సమస్యలను పరిష్కరించేలా ఈ కార్యక్రమం కీలక మలుపుగా నిలుస్తుందన్నారు . తుంగభద్ర నదీ తీరంలో మూడు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి నిర్వహించిన చర్చలు గొప్ప నిర్ణయాలకు దారి తీస్తాయని , అంతర్రాష్ట్ర జల వివాదాలకు ఇది ఒక నమూనా పరిష్కారంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు . ఘర్షణ మార్గాన్ని వదిలి .. మైసూరు , నిజాం రాజుల పాలనలో రాష్ట్ర సరిహద్దులు , భూభాగం విషయంలో తీవ్రమైన తొలి అడుగు రైతుల ప్రయోజనాల కోసం .. ! తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , కర్నాటక రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సాగునీటి సమస్యలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చొరవతో శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని సీఎం రేవంత్ వ్యక్తం చేశారు . తుంగభద్రలో పూడిక పేరుకుపోవడం , నీటి పంపిణీ , కేటాయింపుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తుచేశారు . ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా రైతుల ప్రయోజనాల దృష్ట్యా చూడాలని సూచించారు . పంచాయితీ కావాలా , సమస్య పరిష్కారం కావాలా అంటే తాను పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని రేవంత్ స్పష్టం చేశారు . నీటి సమస్యపై ప్రత్యేక చర్చ సభకు ముందు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ సమావేశం నిర్వహించారు . తెలంగాణ , ఏపీ , కర్నాటక నీటి సమస్యలపై ఇందులో చర్చించారు . కాగా , తుంగభద్రకు సంబంధించి మొత్తం 33 క్రస్ట్ గేట్లను కొత్తగా ఏర్పాటు చేయగా .. మీట నొక్కి 17 వ గేటును కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ , 18 వ గేటును కర్నాటక సీఎం డీకే శివకుమార్ , 19 వ గేటును ఏపీ సీఎం చంద్రబాబు , 20 వ గేటును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు . 2024 ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా 19 వ గేటు దెబ్బతినడంతో , నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ .51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు . విభేదాలే ఉన్నాయని , ఘర్షణలూ జరిగాయని , కానీ రైతుల ప్రయోజనాల విషయంలో మాత్రం వారిద్దరిదీ ఒకే అభిప్రాయమని , తుంగభద్ర ప్రాజెక్టు అందుకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు . ఇద్దరు రాజులు రైతుల ప్రయోజనాల కోసం ఘర్షణల మార్గాన్ని వదిలి పరిష్కార మార్గాన్ని ఎంచుకున్నారని గుర్తుచేశారు . అదే స్ఫూర్తితో నేటి ప్రజాప్రతినిధులు , ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి రైతాంగ ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు . కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ త్వరలోనే తుంగభద్ర , ఆర్డీఎస్కు సంబంధించిన వివాదాస్పద అంశాలపై సమగ్ర పరిష్కారం తీసుకువస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు . తుంగభద్ర నది పక్కన ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశం ఆ కోవలో ఫస్ట్ స్టెప్ అని ఆయన అన్నారు . అందుకే ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజుగా నిలుస్తుందన్నారు . కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు . Kalam Main కల Fri , 26 June 2026 180 - ShareChat