**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 19**
మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **17వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో హనుమంతుడు సుగ్రీవునికి ఎలా సహాయం చేసి రాజ్యాన్ని ఇప్పించాడో చూశాం. ఈరోజు, లంకలో బందీగా ఉన్న విభీషణుడు హనుమంతుని సలహాను పాటించి ఎలా లబ్ధి పొందాడో తెలుసుకోబోతున్నాం.
-----
**17వ చౌపాయి**
**తుమ్హరో మంత్ర బిభీషన మానా |**
**లంకేశ్వర భయే సబ జగ జానా ||**
**ప్రతిపదార్థం:**
* **తుమ్హరో మంత్ర:** నీ యొక్క ఆలోచనను / సలహాను (మంత్రాన్ని)
* **బిభీషన మానా:** విభీషణుడు అంగీకరించాడు (పాటించాడు).
* **లంకేశ్వర భయే:** (దానివల్ల ఆయన) లంకాధిపతి అయి.
* **సబ జగ జానా:** అన్ని లోకాల్లో గౌరవాన్ని పొందాడు.
-----
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
**1. సరైన మార్గనిర్దేశం (మంత్రం):**
మంత్రం అంటే ఆలోచన, వ్యూహం అని రెండు అర్థాలు. మంత్రాంగం అనే మాట కూడా ఉంది.
ఒక మంచి ఆలోచనను ఇచ్చేవాడు మంత్రి. ఆ ఆలోచన మంత్రం అవుతుంది. హనుమంతుడు విభీషణునికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనను విభీషణుడు మన్నించాడు ఆ మన్నించిన దానికి ఫలితం - ఆయన రామచంద్రమూర్తి కరుణను పొంది లంకకు ప్రభువు కాగలిగాడు.
సుందరాకాండ లో హనుమ విభీషణుని ఎక్కడా కలుసు కోలేదు కదా ఆయనకు మంత్రం లేదా మంచి సలహా ఎప్పుడూ ఇచ్చాడు అంటే ఇది బాగా పరిశీలన చేస్తే అర్దం అవుతుంది.
లంక మొత్తం కాల్చిన హనుమ ఒక్క విభీషణుని గృహం మాత్రం వదిలాడు అని వాల్మీకి మహర్షి రామాయణం లో చెప్తాడు. అలాగే సీతమ్మ కోసం లంక మొత్తం వెతుకుతూ ఉంటే ఎక్కడ చూసినా భోగాలలో మునిగిన వారే కనపడతారు. వారిని చూసి జుగుప్స కలిగింది అని చెప్పి.ననంద అనే పదం ఒకటి వాడతారు అంటే అతి కొద్ది మంది మహాత్ములు, సత్పురుషులను చూసి ఆనందం పొందాడు అంటే అందులో విభీషణుడు ఉండవచ్చు.ఆ సమయంలో కలసి కూడా ఉండవచ్చు.
లేదా ఒకరికి మంచి మాట చెప్పినపుడు చెప్పిన వాడు వినక పోయినా, పక్కన ఉన్నవాడు విని మారవచ్చు.
రాముని ఆశ్రయించి శరణు వేడితే బ్రతుకుతావు. 'నేను పాపిని, దుర్మార్గుడను' అంటే అయినా ఫరవాలేదు ఒక్కసారి నువ్వు పాపాత్ముడవని తెలుసుకుని పశ్చాత్తప్తుడవై ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించి నిన్ను అనుగ్రహిస్తాడు. శరణాగతవత్సలుడు రామచంద్రమూర్తి" అని హనుమంతుడు రావణాసురునితో నిండుసభలో చెప్పినప్పుడు అక్కడ విభీషణుడు కూడా ఉన్నాడు.
విభీషణుడు మనస్సులో 'రాముడు దయామయుడు, ఆయనను శరణు వేడాలి. కానీ నేను శత్రువు సోదరుడినే..., నేను వెళ్ళి ఆయనను శరణు వేడితే నన్ను అనుగ్రహిస్తాడా!' అని ఎక్కడో శంక ఉండి ఉండవచ్చు. కానీ హనుమంతుడు రావణుని మందలిస్తూ, “ఇప్పటివరకూ తప్పు చేశాను కదా! తిరిగి రాముని దగ్గరికి వెళ్ళి తప్పు తెలుసుకుని సీతమ్మని అప్పగిస్తే క్షమిస్తాడా! అని సందేహం పెట్టుకోకు రావణా! ఆయన శరణాగతవత్సలుడు. ఇప్పటివరకు జరిగినదేదో జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వెళ్ళి అప్పగించు. ఆయన ఎవరిని శిక్షించదలచుకున్నాడో వారిని ఎవరూ రక్షించలేరు" అని చెప్పాడు.
రాముడు ఎవరిని రక్షించ దలచాడో వారిని ఎవరూ శిక్షించలేర”నే మాట కూడా దాగి ఉంది. ఈ మాట పట్టుకున్నాడు. విభీషణుడు. దానితో ధైర్యం వచ్చి శరణాగతుడయ్యాడు. వాల్మీకి రామాయణం ప్రకారంగా కూడా హనుమంతుడు ఇచ్చిన ఆలోచనని మన్నించి విభీషణుడు శరణాగతుడయ్యాడు ఫలితంగా లంకేశ్వరుడయ్యాడు.
అంతే కాదు పరాశర సంహిత శ్రీ రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన సమయంలో 12 అక్షరాల హనుమాన్ మంత్రాన్ని ఉపదేశించాడు అని చెప్పింది.
రాముని అనుగ్రహం చేత, **ఏనాం విద్యాం ప్రాప్య** ఈ విద్యను పొందాడు విభీషణుడు. విద్య అంటే మంత్రం, ఉపాసన అని అర్థం. హనుమత్ విద్యను పొంది **అచలాం శ్రియమాప్నోతి** - స్థిరమైన ఐశ్వర్యాన్ని లంకా రాజ్యంతో సహా పొందాడు విభీషణుడు. ఆ మాటే 'తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేస్వర భఏ సబజగజానా’
తులసీదాస్ దీనికి రెండు అర్థాలు చూపించారు. మంత్రమనే మాటను రెండు అర్థాలతోను గ్రహించినా రెండూ సరిపోతాయి. విభీషణుడు హనుమన్మంత్ర జప పరాయణుడు. విభీషణుని కొడుకు నీలుడు (వానరసైన్యంలోని నీలుడు వేరు) కూడా గొప్ప హనుమద్భక్తుడు.
ద్వాదశాక్షర సంయుక్తో మంత్రోయం సముదీరితః
- పన్నెండక్షరాల మహామంత్రాన్ని తీసుకుని దానిని సాధన చేసి శీఘ్రముగా భుక్తిని, ముక్తిని విభీషణుడు పొందగలిగాడని చెప్పారు. అంటే రాముడు కూడా కిరీటం పెట్టడంతో పాటు హనుమన్మంత్రాన్ని ఇచ్చి ఒక రక్షణను ఇచ్చాడు.
అంటే సుగ్రీవుడు, విభీషణుడు ఇద్దరూ కూడా హనుమ దయ వల్లనే రామ అనుగ్రహం పొందారు అని ఈ చౌపాయి ల రహస్యం.
**2. భక్తికి లభించిన ఫలితం (లంకేశ్వర):**
రాముడిని ఆశ్రయించిన విభీషణుడికి, రావణుడి మరణానంతరం లంకా సామ్రాజ్యం లభించింది. అంటే, హనుమంతుడు చెప్పిన మాట వినడం వల్ల విభీషణుడికి ప్రాణరక్షణ కలగడమే కాకుండా, రాజయోగం కూడా దక్కింది. "లోకమంతటికీ తెలుసు" (సబ జగ జానా) అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, భగవంతుని నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోరని చెప్పడానికి విభీషణుడే ఒక నిదర్శనం.
-----
**తులసీదాసు గారి సందేశం:**
తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు: **"సత్సంగత్యం"** (మంచి వారితో స్నేహం). విభీషణుడు లంకలో ఉన్నప్పటికీ హనుమంతునితో స్నేహం చేయడం వల్ల తన రాజ్యాన్ని, ధర్మాన్ని కాపాడుకోగలిగాడు. మన జీవితంలో కూడా కష్టాలు ఎదురైనప్పుడు, హనుమంతుని వంటి గురువుల సలహాను పాటిస్తే, లౌకికమైన విజయాలతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా లభిస్తుందని ఈ చౌపాయి సందేశం.
-----
**జై శ్రీరామ్\! జై హనుమాన్\!**
-----
రేపటి చౌపాయిలో హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని మింగిన ఆశ్చర్యకరమైన బాల్య లీలను గురించి తెలుసుకుందాం. #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊


