ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు ప్రారంభోపన్యాసం చేశారు. అందుకు సంబంధించిన ముఖ్యాంశాలు:
• 2014లో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభించినప్పుడు అధికారం, పదవులు అనే ఆలోచన లేదు. దేశానికి ఏం చేయాలి.. దేశ సమైక్యతను, సమగ్రతను ఎలా కాపాడాలి అనే ఆలోచనతోనే జనసేన ప్రస్థానం మొదలయ్యింది.
• పార్టీ సిద్ధాంతాలు, భావజాలం బలపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ కోసం పని చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇది జనసేన భావ జాలం బలంగా ముందుకి వెళ్తుందనడానికి సంకేతం.
• జనసేన పార్టీ ఎల్లప్పుడూ దేశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది.
• తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన పార్టీ వ్యతిరేకించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరునే తప్పుబడుతూ వచ్చాం. విభజన చేసిన తీరులో లోపాల కారణంగా ఈనాటికీ ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉన్నాయి.
• ఢిల్లీలోనే సమావేశం పెట్టడానికి కారణం ఢిల్లీ చరిత్ర గొప్పదనం. ఈ నేల త్యాగాలకు ప్రతీక, పాలనకు ప్రతిరూపం. రాజ్యాంగ విలువలకు ప్రతిబింబం. ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం. ఇలాంటి గొప్ప నేలలో దేశ సమగ్రత కోసం పెట్టిన సమావేశం ద్వారా జనసేన పార్టీ దేశ భక్తికి ఎంత విలువ ఇస్తుందన్నది చెప్పాలన్నదే ఉద్దేశం.
• చలి చీమలు కూడా పాముని చంపేస్తాయన్నట్టు- చెడు అయినా మంచి అయినా దేశానికి, జాతి సమగ్రతకు ద్రోహం చేసే ఎవరిని అయినా జనసేన వ్యతిరేకిస్తుంది. విభజన వాదాన్ని ప్రోత్సహించే వారిని జనసేన పార్టీ ఉపేక్షించదు. అలాంటి వారిపై జనసేన గళం బలంగా ఉంటుంది.
• ఢిల్లీకి జనసేన పార్టీ ఎప్పుడూ అధికారం కోసం, పదవుల కోసం, ప్రాపకాల కోసం ఉపయోగించుకోదు. దేశ భక్తి, దేశ సమగ్రత, సమైక్యత కోసం మాత్రమే దేశ రాజధాని బాట పడతాం.
• పార్టీ ఎంపీలు కూడా దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సమస్యల మీద మాట్లాడాలి అని అన్నారు.
#JanaSenaniInNewDelhi :- #🤩రామ్ చరణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😇My Status #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #😎మెగాస్టార్ ఫ్యాన్స్


