*ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా*
* ఏపీ వ్యాప్తంగా ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరింది. 4,345 బంకుల్లో కొత్తగా 47 మినహా అన్నింటా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. కంపెనీల నుంచి బంకులకు 3,714 కిలోలీటర్ల పెట్రోల్, 7,107 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేశారు. మూడు జిల్లాల్లో మాత్రమే పదికిపైగా బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి, కడప, తిరుపతి జిల్లాల్లో మూతపడిన బంకులకు స్టాక్ సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు.#news #sharechat


