ShareChat
click to see wallet page
search
మండల వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం సచివాలయం ముందు నిరసన ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి: https://www.aptelangana.app/articles/qgctzzdpxwcfbrms #✌️నేటి నా స్టేటస్ #ap news #😇My Status #news #🤘Lets Moj నేను AP telangana app వాడుతున్నాను. మీరు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లా/స్థానిక వార్తలు మరియు ఉద్యోగ అవకాశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి: https://play.google.com/store/apps/details?id=com.aptelangana.app
✌️నేటి నా స్టేటస్ - ర్నూలు జిల్లా దేవనకొండ మండల వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం సచివాలయం ముందు విరసన QAP Download now from Google Play TS NEWS AP TELANGANA NEWS APP * కరివేములలో ఉపాధి పనులు వెంటనే చేపట్టాలి * ... * ఫేస్ యాప్ ను రద్దు చేయాలి పాత పద్ధతిలోనే పని కొనసాగించాలి ... వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ * మండల వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం సచివాలయం ముందు నిరసన రాజకీయ కారణాలతో మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి పనులు నిలపీ వేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు ఎంపీడీవో కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు బైరాయించారు ... ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు జి . వీర శేఖర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు కల్పించాలని కరివేములలో వెంటనే పనులు మొదలుపెట్టాలని అదేవిధంగా ఉపాధి ఉసురు తీసే ఫేస్ యాప్ మీ రద్దు చేయాలని రెండు పూటల పని పేరుతో కూలీలను వేధించరాదని ఆయన డిమాండ్ చేశారు ... బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉపాధి పరిరక్షణ , పనులు కల్పన , ఫేస్ యాప్ రద్దు , పాత పద్ధతిలోనే ఉపాధి పని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయింపు మండలంలోని తెర్నేకల్ , కోటకొండ , కుంకనూరు , దేవనకొండ సచివాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు కూలీలతో కలిసి ధర్నాలకు దిగారు . ఈ సందర్భంగా వీరశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా కార్యదర్శి వీరేంద్ర నాయుడు సిఐటియు మండల కార్యదర్శి అశోక్ , యూసుఫ్ భాష , డివైఎఫ్ ఐ నాయకులు అవిలు లు ఆయా గ్రామాల లో మాట్లాడుతూ , కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ( విబి - రాంబి ) తో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతుందనీ ఉపాధికి ఇది ఉరితాళ్ళు మోసపూరిత కుట్రలని , కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి , గ్రామీణ కార్మికులను కార్పొరేట్ శక్తులకు చౌక శ్రమగా మార్చడానికి పద్ధతి ప్రకారం దీన్ని బలహీనపరుస్తుంది . వి జి జి రాంజీ అనేది పని హక్కులను రాసే ఒక ప్రమాదకరమైన స్కీమ్ అని . ఇది ఉపాధి కల్పించే చట్టం కాదన్నారు నిరుద్యోగం వలసలు పించే గ్యారెంటీ ఇచ్చే పథకమన్నారు పేరుకి 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నాం . అంటూ 60 రోజులు వ్యవసాయ సీజన్లో నిషేధించారనీ పేర్కొన్నారు దీనివలన పని దినాలు తగ్గుతాయని , కొత్త చట్టం ప్రకారం 60 శాతం నిధులు కేంద్రము , రాష్ట్రాలు 40 శాతం విధులు భరించాలని కొత్త చట్టం చెబుతుందనీ , ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని పేర్కొన్నారు దీనివల్ల భారీగా పెండింగ్ వేతనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు రోజుకు రెండుసార్లు డిజిటల్ హాజరు పని ప్రదేశాల్లో కార్మికుల ఫోటోలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని నిర్బంధ విధానాలు ఆచరణ సాధ్యం కాదని , ఉపాధి హామీ రక్షణకు పని ప్రదేశాలు వరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు ఇచ్చే 300 కు 100 అడ్డంకులు సృష్టించి ఉపాధి నుండి మనల్ని దూరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని , పేర్కొన్నారు . ఫేస్ యాప్ రెండు పూటల పనినీ రద్దు చేయాలి . పెండింగ్ వేతనాలు ప్లే సిప్స్ పనిముట్ల ప్రమాదంలో చనిపోతే 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని , కార్మికులకు పనిముట్లు ఇవ్వాలని మంచినీళ్లు వెంటు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో బజారి , కె.పి రాముడు , సుధాకర్ , రవీంద్ర , నాగరాజు , రాముడు , - ShareChat