ShareChat
click to see wallet page
search
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #nizamabad #crime #👉నేరాలు - ఘోరాలు🚨 #📣క్రైమ్ అప్‌డేట్స్🚨
nizamabad - కల కల ప్రజల గళం ... రూ .70 లక్షలకు టోకరా • స్కానింగ్ సెంటర్ ఓనర్ క్కు సిబ్బంది మోసం కలం , నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ నగరంలోని ఒక ప్రముఖ స్కా నింగ్ సెంటర్ యజమాన్యాన్ని మోసం చేసి , ఆరేళ్లుగా రూ .70 లక్షలకు పైగా కాజేసిన ముగ్గురు ఉద్యోగుల బాగోతం బయటపడింది . బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి , ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు . స్కానింగ్ సెంటర్లో 2009 నుంచి సేవలు అందిస్తుండగా .. అక్కడ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న గుండారం సత్యనారాయణ , మరో ఉద్యోగి మీనా కలిసి పథకం ప్రకారం సంస్థను మోసం చేశారు . రోగులకు ఇచ్చే అసలు నగదు రసీదుల్లో కార్బన్ పేపరు తొలగించి , ఆ తర్వాత అదే బిల్లు నంబర్పై పరీక్షల ఫీజు మొత్తాన్ని తక్కువగా చూపిస్తూ ఆఫీస్ రికార్డుల్లో నకిలీ వివరాలు నమోదు Kalam Main Sat , 04 July 2026 చేసేవారు . ఈ విధంగా రోజువారీ వచ్చే నగదును ఆరేళ్లుగా పక్కదారి పట్టిస్తూ రూ .70 లక్షలకు పైగా కాజేశారు . ఈ అక్రమాలు బయటకు పొక్కకుండా ఇతర ఉద్యోగులను బెదిరించడమే కాకుండా , ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారు . బాధితుడు 2025 , జనవరి నుంచి జులై వరకు ఉన్న కొన్ని నకిలీ రసీదుల ఆధారాలను పోలీసులకు సమర్పించారు . ప్రధాన నిందితుడు సత్యనారాయణ తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది . దీంతో వన్ టౌన్ ఎస్ హెచ్వీ రఘుపతి ఆధ్వర్యంలో సత్యనారాయణతో పాటు మీనా , సత్యనారాయణ భార్యపై కేసు నమోదు చేశారు . శుక్రవారం మాణిక్ భండార్ గ్రామంలో గుండారం సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా , పరారీలో ఉన్న మరో ఇద్దరు మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు . - ShareChat